ETV Bharat / state

వైరస్ సోకింది.. వెళ్లి పోయింది.. కానీ ఈ విషయం వారికి తెలీదు!

ఏపీలోని కృష్ణా జిల్లాలో సుమారు 20 శాతం మందికి కరోనా సోకింది.. వెళ్లింది.. కానీ ఈ విషయం వారికి తెలియదు. రక్త నమూనాల పరీక్షల ద్వారా ఈ విషయం వెల్లడైంది. కొవిడ్ వ్యాప్తి, ఇన్​ఫెక్షన్ సోకిన వారు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తించేందుకు వైద్యారోగ్య శాఖ కృష్ణా, తూర్పుగోదావరి, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 'సిరో సర్వైలెన్స్'​ను ఇటీవల నిర్వహించింది.

author img

By

Published : Aug 18, 2020, 11:39 AM IST

serosurveillance-analysis-on-covid19-in-andhrapradesh
వైరస్ సోకింది.. వెళ్లి పోయింది.. కానీ ఈ విషయం వారికి తెలీదు!

ఆంధ్రప్రదేశ్‌లోని 4 జిల్లాల్లో జరిగిన సిరో సర్వైలెన్స్ ఫలితాలపై విశ్లేషణ జరుగుతోంది. ఎంపిక చేసిన వ్యక్తుల్లో 3,750 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. పట్టణాలు/ నగరాల్లో 30 % , గ్రామీణ ప్రాంతాల్లో 70 % చొప్పున ఈ నమూనాలు తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే నమోదైన కేసులు, వయసు, పురుషులు, మహిళల కేటగిరి, ఇతర ప్రమాణాల ప్రకారం ఇప్పటి వరకు వైరస్ సోకని వారి నుంచి మాత్రమే ఈ సేకరణ జరిగింది.

వీరి రక్త నమూనాలను క్లియా మిషన్ల ద్వారా పరీక్షించారు. దీని ప్రకారం కృష్ణా జిల్లాలో సుమారు 20 % మందికి వైరస్ సోకి .. వెళ్లిపోయినట్లు తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాలో 15 %, నెల్లూరు జిల్లాలో 9 % , అనంతపురం జిల్లాలో 12 % నుంచి 14 % మందికి వైరస్ సోకింది. వీరెవరికీ వైరస్ వచ్చి వెళ్లినట్లు తెలియదు. ఈ ఫలితాలను శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషిస్తున్నారు.

కేసుల నమోదుకు తగ్గట్టుగానే..!

కృష్ణా జిల్లాలో నమోదవుతోన్న కేసులకు తగ్గట్లుగానే 'సిరో సర్వైలెన్స్' ఫలితాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నమూనాల సేకరణ జరిగిన ప్రాంతాల వారీగా పరిశీలిస్తే .. ఒక్కొక్కచోట 20 % కంటే ఎక్కువ మందికి వైరస్ సోకి, వెళ్లినట్లు గుర్తించారు. వీరితో పాటు వైరస్ నిర్ధారణ పరీక్షల ద్వారా పాజిటివ్‌గా తేలిన వారిని మినహాయిస్తే.. మిగిలిన వారిలోనే వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించాలి. దీని ప్రకారం కృష్ణా జిల్లాలో వైరస్ సంక్రమణ తక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఫలితాల విశ్లేషణ పూర్తయిన అనంతరం మిగిలిన జిల్లాల్లో ప్రారంభించాలని వైద్యారోగ్య శాఖ యోచిస్తోంది.

ఇదీ చూడండి: పురపాలక శాఖ అధికారులు బాగా పనిచేశారు: కేసీఆర్

ఆంధ్రప్రదేశ్‌లోని 4 జిల్లాల్లో జరిగిన సిరో సర్వైలెన్స్ ఫలితాలపై విశ్లేషణ జరుగుతోంది. ఎంపిక చేసిన వ్యక్తుల్లో 3,750 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. పట్టణాలు/ నగరాల్లో 30 % , గ్రామీణ ప్రాంతాల్లో 70 % చొప్పున ఈ నమూనాలు తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే నమోదైన కేసులు, వయసు, పురుషులు, మహిళల కేటగిరి, ఇతర ప్రమాణాల ప్రకారం ఇప్పటి వరకు వైరస్ సోకని వారి నుంచి మాత్రమే ఈ సేకరణ జరిగింది.

వీరి రక్త నమూనాలను క్లియా మిషన్ల ద్వారా పరీక్షించారు. దీని ప్రకారం కృష్ణా జిల్లాలో సుమారు 20 % మందికి వైరస్ సోకి .. వెళ్లిపోయినట్లు తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాలో 15 %, నెల్లూరు జిల్లాలో 9 % , అనంతపురం జిల్లాలో 12 % నుంచి 14 % మందికి వైరస్ సోకింది. వీరెవరికీ వైరస్ వచ్చి వెళ్లినట్లు తెలియదు. ఈ ఫలితాలను శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషిస్తున్నారు.

కేసుల నమోదుకు తగ్గట్టుగానే..!

కృష్ణా జిల్లాలో నమోదవుతోన్న కేసులకు తగ్గట్లుగానే 'సిరో సర్వైలెన్స్' ఫలితాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నమూనాల సేకరణ జరిగిన ప్రాంతాల వారీగా పరిశీలిస్తే .. ఒక్కొక్కచోట 20 % కంటే ఎక్కువ మందికి వైరస్ సోకి, వెళ్లినట్లు గుర్తించారు. వీరితో పాటు వైరస్ నిర్ధారణ పరీక్షల ద్వారా పాజిటివ్‌గా తేలిన వారిని మినహాయిస్తే.. మిగిలిన వారిలోనే వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించాలి. దీని ప్రకారం కృష్ణా జిల్లాలో వైరస్ సంక్రమణ తక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఫలితాల విశ్లేషణ పూర్తయిన అనంతరం మిగిలిన జిల్లాల్లో ప్రారంభించాలని వైద్యారోగ్య శాఖ యోచిస్తోంది.

ఇదీ చూడండి: పురపాలక శాఖ అధికారులు బాగా పనిచేశారు: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.