ETV Bharat / state

సంక్రాంతికి ముస్తాబైన నారావారిపల్లె.. అధినేత కోసం ఎదురుచూపులు

author img

By

Published : Jan 12, 2023, 3:02 PM IST

Sankranti Festival Arrangements in Naravaripalli Village: నాలుగు సంవత్సరాల తర్వాత నారా, నందమూరి కుటుంబసభ్యులు తమ స్వగ్రామం నారావారిపల్లెకి సంక్రాంతి పండుగకు వస్తున్నారు. ఇరు కుటుంబాల రాక నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈరోజు సాయంత్రానికి నారా, నందమూరి కుటుంబం నారావారిపల్లికు చేరుకుంటుందని సమాచారం.

Sankranti Festival
Sankranti Festival
సంక్రాంతికి ముస్తాబైన నారావారిపల్లె.. అధినేత కోసం ఎదురుచూపులు

Sankranti Festival Arrangements in Naravaripalli Village: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె.. ముందుగానే సంక్రాంతి శోభను సంతరించుకుంది. పండుగ సందర్భంగా నారా, నందమూరి కుటుంబ సభ్యులు నాలుగు సంవత్సరాల తర్వాత స్వగ్రామానికి రానుండడంతో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు సంబరాలు జరుపుకుంటున్నారు.

గత నాలుగు సంవత్సరాలలో ఒక సంవత్సరం అమరావతి రైతులకు మద్దతు, మరో మూడు సంవత్సరాలు కరోనా కారణంగా స్వగ్రామానికి రాకపోవడంతో పండుగ జరుపుకోలేదు. ఈ సంవత్సరం వారు స్వగ్రామానికి వస్తుండడంతో చంద్రగిరి టీడీపీ ఇంఛార్జ్​ పులివర్తి నాని, మండల నాయకులు, గ్రామస్థులతో కలిసి నారావారిపల్లెను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

గత మూడు సంవత్సరాలుగా గ్రామంలో పండుగ నిర్వహించుకోలేకపోయామని.. ఈసారి చంద్రబాబు కుటుంబం రాకతో పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. స్వాగతం పలికే బ్యానర్లు, ప్రతి ఏడాది జరిపే ముగ్గుల పోటీలను నిర్వహించేందుకు స్థలాన్ని.. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే కార్యకర్తలు, నాయకులకు భోజనం, తాగునీటి వసతి , వాహనాలు నిలుపుకునేందుకు స్థలం, ప్రజలను కలిసేందుకు స్థలాన్ని సిద్ధం చేసి ఉంచారు.

బాలకృష్ణ, చంద్రబాబు మనవడు దేవాన్ష్ ఎద్దుల బండిపై గ్రామంలో తిరుగుతూ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతారని సమాచారం. అందుకు సంబంధించిన ఎడ్ల బండిని సిద్ధం చేసి ఉంచారు. ఈరోజు సాయంత్రానికి నారా, నందమూరి కుటుంబం నారావారిపల్లెకు చేరుకుంటుందని సమాచారం.

ఇవీ చదవండి:

సంక్రాంతికి ముస్తాబైన నారావారిపల్లె.. అధినేత కోసం ఎదురుచూపులు

Sankranti Festival Arrangements in Naravaripalli Village: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె.. ముందుగానే సంక్రాంతి శోభను సంతరించుకుంది. పండుగ సందర్భంగా నారా, నందమూరి కుటుంబ సభ్యులు నాలుగు సంవత్సరాల తర్వాత స్వగ్రామానికి రానుండడంతో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు సంబరాలు జరుపుకుంటున్నారు.

గత నాలుగు సంవత్సరాలలో ఒక సంవత్సరం అమరావతి రైతులకు మద్దతు, మరో మూడు సంవత్సరాలు కరోనా కారణంగా స్వగ్రామానికి రాకపోవడంతో పండుగ జరుపుకోలేదు. ఈ సంవత్సరం వారు స్వగ్రామానికి వస్తుండడంతో చంద్రగిరి టీడీపీ ఇంఛార్జ్​ పులివర్తి నాని, మండల నాయకులు, గ్రామస్థులతో కలిసి నారావారిపల్లెను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

గత మూడు సంవత్సరాలుగా గ్రామంలో పండుగ నిర్వహించుకోలేకపోయామని.. ఈసారి చంద్రబాబు కుటుంబం రాకతో పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. స్వాగతం పలికే బ్యానర్లు, ప్రతి ఏడాది జరిపే ముగ్గుల పోటీలను నిర్వహించేందుకు స్థలాన్ని.. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే కార్యకర్తలు, నాయకులకు భోజనం, తాగునీటి వసతి , వాహనాలు నిలుపుకునేందుకు స్థలం, ప్రజలను కలిసేందుకు స్థలాన్ని సిద్ధం చేసి ఉంచారు.

బాలకృష్ణ, చంద్రబాబు మనవడు దేవాన్ష్ ఎద్దుల బండిపై గ్రామంలో తిరుగుతూ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతారని సమాచారం. అందుకు సంబంధించిన ఎడ్ల బండిని సిద్ధం చేసి ఉంచారు. ఈరోజు సాయంత్రానికి నారా, నందమూరి కుటుంబం నారావారిపల్లెకు చేరుకుంటుందని సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.