ETV Bharat / state

సీఎం బాటలో నడిస్తే... లాభాల బాటలో ఆర్టీసీ: మంత్రి పువ్వాడ - రోడ్డు భద్రతా వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ

ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించి... ఆర్టీసీని లాభాలబాట పట్టించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సూచించారు. నైపుణ్యమైన డ్రైవర్ల వల్ల ప్రమాద రహిత సంస్థగా ఆర్టీసీ ప్రఖ్యాతిగాంచిందని ఆయన పేర్కొన్నారు.

Road Safety Weekend in Hyderabad
'ఆర్టీసీని కాపాడడానికి ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలు ఫలిస్తాయి'
author img

By

Published : Jan 31, 2020, 10:01 PM IST

డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, వేగనియంత్రణ పాటించాలని, ద్విచక్ర వాహనం నడిపేవారు... వెనుక కూర్చున్నవారు విధిగా శిరస్త్రాణం ధరించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ సూచించారు. హైదరాబాద్​లో నిర్వహించిన 31వ రోడ్డు భద్రతా వారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలిస్తే వారి ప్రాణాలు కాపాడొచ్చని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆర్టీసీ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని... సంస్థను కాపాడడానికి సీఎం తీసుకున్న చర్యలు ఫలితాలనిస్తాయని పువ్వాడ అన్నారు. అధికారులు, సిబ్బంది సంస్థను లాభాల బాట పట్టించాలని మంత్రి ఆకాక్షించారు. ప్రమాదాల రహితంగా బస్సులు నడిపిన వివిధ డిపోలకు చెందిన డ్రైవర్లకు మంత్రి నగదు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌, రవాణ శాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

'ఆర్టీసీని కాపాడడానికి ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలు ఫలిస్తాయి'

ఇదీ చూడండి: హారన్ వేశారో... ఆగి తీరాల్సిందే

డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, వేగనియంత్రణ పాటించాలని, ద్విచక్ర వాహనం నడిపేవారు... వెనుక కూర్చున్నవారు విధిగా శిరస్త్రాణం ధరించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ సూచించారు. హైదరాబాద్​లో నిర్వహించిన 31వ రోడ్డు భద్రతా వారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలిస్తే వారి ప్రాణాలు కాపాడొచ్చని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆర్టీసీ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని... సంస్థను కాపాడడానికి సీఎం తీసుకున్న చర్యలు ఫలితాలనిస్తాయని పువ్వాడ అన్నారు. అధికారులు, సిబ్బంది సంస్థను లాభాల బాట పట్టించాలని మంత్రి ఆకాక్షించారు. ప్రమాదాల రహితంగా బస్సులు నడిపిన వివిధ డిపోలకు చెందిన డ్రైవర్లకు మంత్రి నగదు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌, రవాణ శాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

'ఆర్టీసీని కాపాడడానికి ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలు ఫలిస్తాయి'

ఇదీ చూడండి: హారన్ వేశారో... ఆగి తీరాల్సిందే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.