ETV Bharat / state

గాంధీభవన్​లో ఘనంగా రాజీవ్​గాంధీ జయంతి వేడుకలు - గాంధీభవన్​లో ఘనంగా రాజీవ్​గాంధీ జయంతి వేడుకలు

భారత మాజీ ప్రధాని రాజీవ్​గాంధీ 75వ జయంతి వేడుకలు గాంధీభవన్​లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దేశాభివృద్ధికి రాజీవ్​ గాంధీ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

గాంధీభవన్​లో ఘనంగా రాజీవ్​గాంధీ జయంతి వేడుకలు
author img

By

Published : Aug 20, 2019, 10:34 PM IST

Updated : Aug 20, 2019, 11:49 PM IST

రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలను ప్రతి కార్యకర్త ఇంటింటికీ తీసుకువెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజీవ్‌ గాంధీ 75వ జయంతి ఉత్సవాలను గాంధీ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. గాంధీ, నెహ్రు కుటుంబాలు చేసిన త్యాగాలను భాజపా తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా హోంమంత్రి అమిత్ షా నెహ్రూని కించ పరిచేలా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. మండల కమిషన్ తీసుకొచ్చి స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి రాజీవ్‌ గాంధీ కృషి చేశారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులకు గుర్తింపు ఇవ్వాలని రాజీవ్ గాంధీ ఆనాడే చెప్పారని వీహెచ్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లకు తెరాస ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్​ కొణిజేటి రోశయ్య, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్​ చౌహాన్​, రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ఇతర నేతలు పాల్గొన్నారు.

గాంధీభవన్​లో ఘనంగా రాజీవ్​గాంధీ జయంతి వేడుకలు

ఇదీ చూడండి: 'కేసీఆర్​పై సీబీఐ కేసులను ఎందుకు పక్కనపెట్టారు'

రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలను ప్రతి కార్యకర్త ఇంటింటికీ తీసుకువెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజీవ్‌ గాంధీ 75వ జయంతి ఉత్సవాలను గాంధీ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. గాంధీ, నెహ్రు కుటుంబాలు చేసిన త్యాగాలను భాజపా తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా హోంమంత్రి అమిత్ షా నెహ్రూని కించ పరిచేలా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. మండల కమిషన్ తీసుకొచ్చి స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి రాజీవ్‌ గాంధీ కృషి చేశారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులకు గుర్తింపు ఇవ్వాలని రాజీవ్ గాంధీ ఆనాడే చెప్పారని వీహెచ్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లకు తెరాస ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్​ కొణిజేటి రోశయ్య, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్​ చౌహాన్​, రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ఇతర నేతలు పాల్గొన్నారు.

గాంధీభవన్​లో ఘనంగా రాజీవ్​గాంధీ జయంతి వేడుకలు

ఇదీ చూడండి: 'కేసీఆర్​పై సీబీఐ కేసులను ఎందుకు పక్కనపెట్టారు'

Tg_hyd_80_20_rajive_jayanthi_rosaih_prudhviraj_AB_3038066 Reporter: M.Tirupal Reddy Note: ఫీడ్ గాంధీభవన్ OFC నుంచి వచ్చింది. () స్వర్గీయ రాజీవ్‌గాంధీ దేశంలో సమర్థమైన ప్రధానమంత్రిగా రాణించారని పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి కొనియాడారు. రాజీవ్‌గాంధీ 75వ జయంతి ఉత్సవాల్లో భాగంగా గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, ఏఐసిసి కార్యదర్శులు బోస్ రాజు, శ్రీనివాస కృష్ణన్, సలీం ఆహమ్మద్, శైలజనాథ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు, మల్లు రవి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే జగ్గా రెడ్డి, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. గాంధీ,నెహ్రు కుటుంబాల త్యాగాలను తగ్గించే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా హోం మంత్రి అమిత్ షా నెహ్రు ని కించ పరిచే విధంగా మాట్లాడడం దురదృష్ట కరమన్నారు. రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని సాంకేతిక విప్లవం వైపు తీసుకువెళ్లాడం లో రాజీవ్ గాంధీ కృషి చేస్తున్నారన్నారు బైట్: ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
Last Updated : Aug 20, 2019, 11:49 PM IST

For All Latest Updates

TAGGED:

congress
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.