కరెంటు బిల్లులు ఆన్లైన్ ద్వారా చెల్లించాలని జెన్కో-ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు కోరారు. లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో వినియోగదారులు నేరుగా నగదు రూపంలో బిల్లులు చెల్లించడం సాధ్యం కానందు వల్ల ఈ సౌకర్యం వినియోగించుకోవాలన్నారు. ప్రస్తుత బిల్లులే కాకుండా గతంలో వినియోగించిన విద్యుత్కు సంబంధించిన బకాయిలు కూడా చెల్లించాల్సివుందని చెప్పారు.
లాక్డౌన్ అమలవుతున్నప్పటికీ విద్యుత్ సంస్థలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి 24 గంటల పాటు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాయని చెప్పారు. ఈ సదుపాయం నిరాటంకంగా కొనసాగడానికి వినియోగదారులు బిల్లులు చెల్లించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: కరోనాపై పోరులో ప్రజలకు రేపు మోదీ వీడియో సందేశం