ETV Bharat / state

Pakistani Arrested in Hyderabad Update : 'ఎంత పని చేసినవ్ మావా.. నీ బిడ్డ కోసం దేశం దాటొస్తే.. నన్నే పట్టిస్తవా..?'

Pakistani Arrested in Hyderabad Update : ఈ నెల 1వ తేదీన పాకిస్థానీ యువకుడ్ని అరెస్ట్​ చేసి విచారించగా.. ఎవరు ఊహించని ట్విస్ట్​ తెలిసింది. సాయం చేస్తానని పిలిచిన మామే.. వెన్నుపోటు పొడిచాడు. యువకుడు తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయని తెలిసి సైలెంట్​గా పోలీసులకి సమాచారం ఇచ్చి.. అరెస్ట్​ చేయించాడు. ఆ తరవాత ఏమి జరిగిందంటే..!

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2023, 2:04 PM IST

Pakistani Crossing India Border Illegally
Pakistani Arrested in Hyderabad

Pakistani Arrested Update in Hyderabad : ఈనెల 1వ తేదీన తన భార్యాబిడ్డలను చూడటానికి పాకిస్థాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అతడు ఇండియాలోకి ప్రవేశించేందుకు అత్తామామలే సహకరించినట్లు తొలుత తేలింది. అయితే ఇప్పుడు ఈ కేసులో ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ వ్యక్తి ఇండియాలోకి వచ్చేందుకు సహకరించిన మామే.. అతడికి సంబంధించి సమాచారాన్ని పోలీసులకు అందించి వారికి పట్టించినట్లు తేలింది. అసలు ఈ మామా అల్లుడి స్టోరీ ఏంటో ఓసారి తెలుసుకుందామా..?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫయాజ్ అహ్మద్‌(24) పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పంక్తుఖ్వాకు చెందిన యువకుడు. 2018లో షార్జాలోని సైఫ్‌జోన్‌ వస్త్ర పరిశ్రమలో పని చేసేవాడు. ఈ క్రమంలో హైదరాబాద్​కు చెందిన నేహ ఫాతిమా(29) ఉపాధి కోసం షార్జాకు వెళ్లింది. ఆమె ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ యువకుడు ఫాతిమాకు సాయం చేశాడు. ఆ సమయంలో వారి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహం.. ప్రేమ.. పెళ్లిగా మారేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. 2019 షార్జాలోనే వారు వివాహం చేసుకున్నారు.

Pakistani Fayaz Ahmed Love Story
పాకిస్థాన్ యువకుడు ఫయాజ్ అహ్మద్

Pakistani Love Story : మూడు సంవత్సరాలు షార్జాలో వారి వివహబంధం కొనసాగిన అనంతరం.. గర్భవతి కావడం.. పలు ఆరోగ్య సమస్యల కారణంగా ఫాతిమా హైదరాబాద్​​ వచ్చింది. ఇక్కడికి వచ్చిన ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. షార్జాలో ఉంటున్న ఫయాజ్​ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటాయని ఫాతిమా తండ్రి జుబేష్ షేక్​ భావించి.. సరికొత్త పథకం రచించాడు. అల్లుడు పాకిస్థాన్​లో ఉన్నాడని తెలుసుకుని.. ఇండియాకు రప్పించే ప్రయత్నం చేశాడు.

Pakistani Arrested in Hyderabad : షార్జాలో పెళ్లి.. హైదరాబాద్​లో కాపురం.. భార్య కోసం సరిహద్దులు దాటిన పాకిస్థానీ అరెస్ట్

Hyderabad girl Pakistan Boy Love Story : అల్లుడిని భారత్​కు వచ్చేయమని.. ఎలాంటి ఇబ్బంది రాకుండా తాను చూసుకుంటానని .. తన కుమార్తె, మనవడి పేరు చెప్పి ఎమోషనల్​ బ్లాక్ మెయిల్ చేశాడు. తన భార్యాబిడ్డలను చూడటానికైనా భారత్ వెళ్లాలని ఫయాజ్ నిర్ణయించుకున్నాడు. ఇదే విషయం తమ మామకు చెప్పాడు. అయితే భారత్​ వీసా రాడానికి ఎక్కువ సమయం పడుతుందని.. అందువల్ల నేపాల్​ వీసా తీసుకోమని ఫయాజ్​కు తన మామ జుబేష్ షేక్ సలహా ఇచ్చాడు. అలా గతేడాది నవంబర్​లో అత్తమామలు జుబేష్‌, అఫ్జల్‌ బేగంతో పాటు యువకుడి భార్య ఫాతిమా నేపాల్​ వెళ్లి ఫయాజ్​ను కలిశారు. అక్కడి నుంచి నలుగురు నేపాల్‌-యూపీ సోనాలీ సరిహద్దు వద్ద గస్తీ సిబ్బందికి రూ.5,000 ఇచ్చి రైలులో హైదరాబాద్‌ చేరుకున్నారు.

Pakistani Crossing India Border Illegally : హైదరాబాద్​ చేరుకున్న అనంతరం పాక్​ అల్లుడిని.. భారత పౌరునిగా మార్చేందుకు మామ మార్గాలను వెతకడం ప్రారంభించాడు. ఆధార్​కార్డు వచ్చేంత వరకు అతడ్ని దాదాపు ఏడాదిన్నర ఇల్లు కదలకుండా చేశాడు. మార్చి నెలలో ఫయాజ్‌ బామ్మర్ధి మహ్మద్‌ గౌస్‌ పేరుతో ఓ మీ-సేవ కేంద్రం ద్వారా రూ.5వేలు ఇచ్చి జీహెచ్‌ఎంసీ నుంచి జనన ధ్రువపత్రం పొందారు. అనంతరం ఆధార్​కార్డు పొందేందుకు మాదాపూర్​లోని ఆధార్​కేంద్రాని(Aadhar Center)కి ఫయాజ్​ వెళ్లాడు. ఈ సమయంలో అల్లుడు తెచ్చిన రూ.4-5 లక్షలు అయిపోవడంతో మామ దుర్బద్ధి బయటపడింది. ఎలాగైనా అల్లుడ్ని వదిలించుకోవాలని భావించి.. అతనే స్వయంగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఈ నెల 1న ఆ యువకుడ్ని అరెస్ట్​ చేశారు. అనంతరం అతని అత్తామామలను కూడా అదుపులోకి తీసుకున్నారు.

మతం మార్చుకుని పాక్‌ ప్రియుడితో పెళ్లి.. ఫాతిమాగా పేరు మార్చుకుని అంజూ వివాహం

పాక్​ యువతిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు హైదరాబాదీ సాహసం.. రంగంలోకి దిగిన పోలీసులు

'మేం హిందుస్థానీ.. మా వీధి పాకిస్థానీ'

Pakistani Arrested Update in Hyderabad : ఈనెల 1వ తేదీన తన భార్యాబిడ్డలను చూడటానికి పాకిస్థాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అతడు ఇండియాలోకి ప్రవేశించేందుకు అత్తామామలే సహకరించినట్లు తొలుత తేలింది. అయితే ఇప్పుడు ఈ కేసులో ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ వ్యక్తి ఇండియాలోకి వచ్చేందుకు సహకరించిన మామే.. అతడికి సంబంధించి సమాచారాన్ని పోలీసులకు అందించి వారికి పట్టించినట్లు తేలింది. అసలు ఈ మామా అల్లుడి స్టోరీ ఏంటో ఓసారి తెలుసుకుందామా..?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫయాజ్ అహ్మద్‌(24) పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పంక్తుఖ్వాకు చెందిన యువకుడు. 2018లో షార్జాలోని సైఫ్‌జోన్‌ వస్త్ర పరిశ్రమలో పని చేసేవాడు. ఈ క్రమంలో హైదరాబాద్​కు చెందిన నేహ ఫాతిమా(29) ఉపాధి కోసం షార్జాకు వెళ్లింది. ఆమె ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ యువకుడు ఫాతిమాకు సాయం చేశాడు. ఆ సమయంలో వారి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహం.. ప్రేమ.. పెళ్లిగా మారేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. 2019 షార్జాలోనే వారు వివాహం చేసుకున్నారు.

Pakistani Fayaz Ahmed Love Story
పాకిస్థాన్ యువకుడు ఫయాజ్ అహ్మద్

Pakistani Love Story : మూడు సంవత్సరాలు షార్జాలో వారి వివహబంధం కొనసాగిన అనంతరం.. గర్భవతి కావడం.. పలు ఆరోగ్య సమస్యల కారణంగా ఫాతిమా హైదరాబాద్​​ వచ్చింది. ఇక్కడికి వచ్చిన ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. షార్జాలో ఉంటున్న ఫయాజ్​ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటాయని ఫాతిమా తండ్రి జుబేష్ షేక్​ భావించి.. సరికొత్త పథకం రచించాడు. అల్లుడు పాకిస్థాన్​లో ఉన్నాడని తెలుసుకుని.. ఇండియాకు రప్పించే ప్రయత్నం చేశాడు.

Pakistani Arrested in Hyderabad : షార్జాలో పెళ్లి.. హైదరాబాద్​లో కాపురం.. భార్య కోసం సరిహద్దులు దాటిన పాకిస్థానీ అరెస్ట్

Hyderabad girl Pakistan Boy Love Story : అల్లుడిని భారత్​కు వచ్చేయమని.. ఎలాంటి ఇబ్బంది రాకుండా తాను చూసుకుంటానని .. తన కుమార్తె, మనవడి పేరు చెప్పి ఎమోషనల్​ బ్లాక్ మెయిల్ చేశాడు. తన భార్యాబిడ్డలను చూడటానికైనా భారత్ వెళ్లాలని ఫయాజ్ నిర్ణయించుకున్నాడు. ఇదే విషయం తమ మామకు చెప్పాడు. అయితే భారత్​ వీసా రాడానికి ఎక్కువ సమయం పడుతుందని.. అందువల్ల నేపాల్​ వీసా తీసుకోమని ఫయాజ్​కు తన మామ జుబేష్ షేక్ సలహా ఇచ్చాడు. అలా గతేడాది నవంబర్​లో అత్తమామలు జుబేష్‌, అఫ్జల్‌ బేగంతో పాటు యువకుడి భార్య ఫాతిమా నేపాల్​ వెళ్లి ఫయాజ్​ను కలిశారు. అక్కడి నుంచి నలుగురు నేపాల్‌-యూపీ సోనాలీ సరిహద్దు వద్ద గస్తీ సిబ్బందికి రూ.5,000 ఇచ్చి రైలులో హైదరాబాద్‌ చేరుకున్నారు.

Pakistani Crossing India Border Illegally : హైదరాబాద్​ చేరుకున్న అనంతరం పాక్​ అల్లుడిని.. భారత పౌరునిగా మార్చేందుకు మామ మార్గాలను వెతకడం ప్రారంభించాడు. ఆధార్​కార్డు వచ్చేంత వరకు అతడ్ని దాదాపు ఏడాదిన్నర ఇల్లు కదలకుండా చేశాడు. మార్చి నెలలో ఫయాజ్‌ బామ్మర్ధి మహ్మద్‌ గౌస్‌ పేరుతో ఓ మీ-సేవ కేంద్రం ద్వారా రూ.5వేలు ఇచ్చి జీహెచ్‌ఎంసీ నుంచి జనన ధ్రువపత్రం పొందారు. అనంతరం ఆధార్​కార్డు పొందేందుకు మాదాపూర్​లోని ఆధార్​కేంద్రాని(Aadhar Center)కి ఫయాజ్​ వెళ్లాడు. ఈ సమయంలో అల్లుడు తెచ్చిన రూ.4-5 లక్షలు అయిపోవడంతో మామ దుర్బద్ధి బయటపడింది. ఎలాగైనా అల్లుడ్ని వదిలించుకోవాలని భావించి.. అతనే స్వయంగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఈ నెల 1న ఆ యువకుడ్ని అరెస్ట్​ చేశారు. అనంతరం అతని అత్తామామలను కూడా అదుపులోకి తీసుకున్నారు.

మతం మార్చుకుని పాక్‌ ప్రియుడితో పెళ్లి.. ఫాతిమాగా పేరు మార్చుకుని అంజూ వివాహం

పాక్​ యువతిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు హైదరాబాదీ సాహసం.. రంగంలోకి దిగిన పోలీసులు

'మేం హిందుస్థానీ.. మా వీధి పాకిస్థానీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.