ETV Bharat / state

రేపటి నుంచే కొత్త మద్యం విధానం

author img

By

Published : Oct 31, 2019, 7:55 PM IST

Updated : Oct 31, 2019, 11:53 PM IST

తెలంగాణలో రేపటి నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. ఇప్పటికే 2,216 దుకాణాల ఏర్పాటుకు కొత్త లైసెన్స్​లు జారీ ప్రక్రియ పూర్తైంది.

రేపటి నుంచే కొత్త మద్యం విధానం

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 90శాతం మందికి లైసెన్స్‌లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. రేపటి నుంచి కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉండడం వల్ల లైసెన్సీలకు మద్యం సరఫరా చేసే ప్రక్రియ ఈ రాత్రి నుంచే ప్రారంభం కానుంది. రాత్రి పది గంటల నుంచి తెల్లవార్లు కొనసాగుతుంది. దీనికోసం రాష్ట్రంలోని 19 మద్యం డిపోలు రాత్రంతా పని చేస్తాయని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోడానికి తగిన వసతి ఉన్న వారంతా రేపటి నుంచి విక్రయాలు ప్రారంభిస్తారని...మిగిలిన వారు...ఒకట్రెండు రోజులు ఆలస్యంగా దుకాణాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రేపటి నుంచే కొత్త మద్యం విధానం

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 90శాతం మందికి లైసెన్స్‌లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. రేపటి నుంచి కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉండడం వల్ల లైసెన్సీలకు మద్యం సరఫరా చేసే ప్రక్రియ ఈ రాత్రి నుంచే ప్రారంభం కానుంది. రాత్రి పది గంటల నుంచి తెల్లవార్లు కొనసాగుతుంది. దీనికోసం రాష్ట్రంలోని 19 మద్యం డిపోలు రాత్రంతా పని చేస్తాయని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోడానికి తగిన వసతి ఉన్న వారంతా రేపటి నుంచి విక్రయాలు ప్రారంభిస్తారని...మిగిలిన వారు...ఒకట్రెండు రోజులు ఆలస్యంగా దుకాణాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రేపటి నుంచే కొత్త మద్యం విధానం

ఇదీ చూడండి: గుడ్‌విల్‌తో "మద్యం" దుకాణాలకు గాలం

 TG_HYD_73_31_TOMORROW_ON_WORDS_NEW_POLICY_AV_3038066 Reporter: Tirupal Reddy Dry ()తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి నూతన మద్యం విధానం అమలులోకి రానుంది. ఇప్పటికే 2,216 దుకాణాల ఏర్పాటుకు కొత్త లైసెన్సీల ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యింది. ఇందుకు సంబంధించి ఆయా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు నూతన లైసెన్సీలకు లైసెన్స్‌లు జారీ చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే తగిన పత్రాలు, బ్యాంకు గ్యారెంటీ, ఎక్సైజ్‌ ట్యాక్స్‌ చెల్లించిన 90శాతం మందికి లైసెన్స్‌లు జారీ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రేపటి నుంచి కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉండడంతో...లైసెన్సీలకు మద్యం సరఫరా చేసే ప్రక్రియ ఈ రాత్రి నుంచే ప్రారంభం అవుతుంది. రాత్రి పది గంటల తరువాత మొదలై రాత్రి అంతా కొనసాగుతుంది. ఇందుకోసం రాష్ట్రంలోని 19 మద్యం డిపోలు రాత్రి అంతా పని చేస్తాయని అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోడానికి తగిన గదులు దొరికిన వారంతా రేపు ఉదయం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభిస్తారని...మిగిలిన వారు...ఒకట్రెండు రోజులు ఆలస్యంగా దుకాణాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
Last Updated : Oct 31, 2019, 11:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.