ETV Bharat / state

భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రార్థనలు చేసుకోండి : ఎమ్మెల్యే ముఠాగోపాల్

author img

By

Published : May 24, 2020, 7:40 PM IST

ముస్లిం సోదరులు భౌతిక దూరాన్ని పాటిస్తూ.. ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవాలని, సామరస్యంగా పండుగ నిర్వహించుకోవాలని ముషీరాబాద్​ శాసన సభ్యులు ముఠా గోపాల్​ సూచించారు. నియోజకవర్గంలోని హరి నగర్​లో ముస్లింలకు నిత్యావసరాలు అందించారు.

MLA Mutaa Gopal Distributes Groceries For Muslims
భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రార్థనలు చేసుకోండి : ఎమ్మెల్యే ముఠాగోపాల్

ముస్లిం సోదరులు రంజాన్​ పండుగను భౌతిక దూరం పాటిస్తూ.. ఇళ్లలోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్​ సూచించారు. ఏటా సంబురంగా నిర్వహించుకునే రంజాన్​ పర్వదినం ఈసారి కరోనా వల్ల ఎవరి ఇంట్లో వారు చేసుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.

రంజాన్​ పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని హరి నగర్​లో తెరాస సీనియర్​ నాయకులు జావిద్​ ఖాన్​, ఎజాజ్​ హుస్సేన్​, ముక్తార్​ హుస్సేన్​లు కలిసి ఏర్పాటు చేసిన నిత్యావసరాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్​, రామ్ నగర్​ డివిజన్​ కార్పొరేటర్​ శ్రీనివాస్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముస్లిం సోదరులు రంజాన్​ పండుగను భౌతిక దూరం పాటిస్తూ.. ఇళ్లలోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్​ సూచించారు. ఏటా సంబురంగా నిర్వహించుకునే రంజాన్​ పర్వదినం ఈసారి కరోనా వల్ల ఎవరి ఇంట్లో వారు చేసుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.

రంజాన్​ పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని హరి నగర్​లో తెరాస సీనియర్​ నాయకులు జావిద్​ ఖాన్​, ఎజాజ్​ హుస్సేన్​, ముక్తార్​ హుస్సేన్​లు కలిసి ఏర్పాటు చేసిన నిత్యావసరాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్​, రామ్ నగర్​ డివిజన్​ కార్పొరేటర్​ శ్రీనివాస్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: గ్రేటర్​లో కొత్త ప్రాంతాల్లో పెరుగుతున్న కొవిడ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.