ETV Bharat / state

ఒక్క ఎమ్మెల్యే వ్యతిరేకిస్తే.. మీకు ఇంత భయమా: శ్రీధర్​ రెడ్డి - ఆయన భద్రతను ప్రభుత్వం తొలగించింది

MLA Kotam Reddy Sridhar Reddy: బెదిరింపు కాల్స్‌ వస్తున్న తనకు అదనపు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం.. ఉన్న గన్‌మెన్లను తొలగించడం కక్షపూరితమేనని ఏపీలోని వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. మానసికంగా హింసించేందుకే గన్‌మెన్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన 2+2 గన్‌మెన్లలో ఇద్దరిని తొలగించిందన్నారు. మిగిలిన ఇద్దరు గన్‌మెన్లనూ ఆయన తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. భద్రత తగ్గించినా నియోజకవర్గంలో ఒంటరిగా తిరుగుతానని వివరించారు. ఎవరూ ఏం చేసినా ప్రజా సమస్యలపై గళం విప్పుతానని ఆయన తేల్చి చెప్పారు.

kotamreddy sridhar reddy
kotamreddy sridhar reddy
author img

By

Published : Feb 5, 2023, 10:43 PM IST

ఒక్క ఎమ్మెల్యే వ్యతిరేకిస్తే.. మీకు ఇంత భయమా: శ్రీధర్​ రెడ్డి

MLA Kotam Reddy Sridhar Reddy: తనపై కక్షసాధింపు చర్యలలో భాగంగా..మానసికంగా హింసించేందుకే ప్రభుత్వం భద్రత తగ్గించిందని ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు రూరల్​ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డి ఆరోపించారు. బెదిరింపు ఫోన్​కాల్స్​ వస్తున్న సందర్భంలో ఇద్దరు గన్​మెన్లను తొలగించడమేంటని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం నాకు 2 + 2 భద్రత కల్పించిందని ఆయన తెలిపారు. శనివారం ఇద్దరు గన్​మెన్లను తొలగించారు. ఎవరి ఆదేశాలతో గన్​మెన్​లను తొలగించారని.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పనిదే ఈ పని చేయరని విమర్శించారు.

ప్రస్తుతం ఇద్దరు గన్​మెన్​లను తొలగించిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డి వివరించారు. ప్రభుత్వం ఇద్దరు గన్​మెన్​లను తొలగించగా.. మిగతా ఇద్దరి గన్​మెన్​లను.. తాను ప్రభుత్వానికి రిటర్న్​ గిఫ్ట్​ ఇస్తున్నానని అన్నారు. ఇద్దరు గన్​మెన్​లను తొలగిస్తే భయపడనని.. మిగిలిన ఇద్దర్ని గౌరవంగా ప్రభుత్వానికి అప్పగిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గన్​మెన్​ను స్వీకరించలేదని గుర్తు చేశారు.

ఎక్కడికైనా ఒంటరిగా వెళ్తాను: ఎక్కడికైనా ఒంటరిగా వెళ్తానని.. ఏం భయపడనని కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల గొంతుకే.. తన గొంతుక అని వివరించారు. సినిమా డైలాగులు చెప్పటం లేదని.. అసలు నిజమిదేనని తగ్గేదేలే అని హెచ్చరించారు. మరింత పట్టుదలతో ముందుకెళ్తానని అన్నారు. 175 సీట్లలో అన్నింటిలో విజయం సాధిస్తామని చెప్తున్నవారు.. ఒక్క ఎమ్మెల్యే వ్యతిరేకిస్తే మీకు ఇంతా భయమా అని ప్రశ్నించారు. ఒక్కడిని లక్ష్యంగా చేసుకుని బెదిరింపు కాల్స్​ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భద్రతా విషయంలో తన తలరాత ఏ విధంగా ఉంటే అలానే జరుగుతుంది: తాను పొరపాటు చేసి ఉంటే భగవంతుడు, ప్రజలు తనకు శిక్ష వేస్తారని కోటంరెడ్డి అన్నారు. తాను తప్పు చేయలేదని భావిస్తే అండగా ఉండాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. భద్రతా విషయంలో తన తలరాత ఏ విధంగా ఉంటే అలానే జరుగుతుందని పేర్కొన్నారు. ఇన్నాళ్లపాటు తనకు సెక్యూరిటీగా విధులు నిర్వర్తించిన ఇద్దరు సిబ్బందికి ఆయన వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన గన్‌మెన్లను గుండెలకు హత్తుకొని కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డి ఓదార్చారు.

"ఎక్కడికైనా ఒంటరిగా వెళ్తానని.. ఏం భయపడను. నేను పొరపాటు చేసి ఉంటే భగవంతుడు, ప్రజలు నాకు శిక్ష వేస్తారు. నేను తప్పు చేయలేదని భావిస్తే అండగా ఉండాలని ప్రజలను కోరుతున్నా. భద్రతా విషయంలో తన తలరాత ఏ విధంగా ఉంటే అలానే జరుగుతుంది." - కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డి, ఎమ్మెల్యే

ఇవీ చదవండి: ఈ నెలాఖరులో శాసనసభ రద్దు.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన: ఉత్తమ్​ కుమార్​రెడ్డి

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్​.. డీఏ 4శాతం పెంపు!

ఒక్క ఎమ్మెల్యే వ్యతిరేకిస్తే.. మీకు ఇంత భయమా: శ్రీధర్​ రెడ్డి

MLA Kotam Reddy Sridhar Reddy: తనపై కక్షసాధింపు చర్యలలో భాగంగా..మానసికంగా హింసించేందుకే ప్రభుత్వం భద్రత తగ్గించిందని ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు రూరల్​ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డి ఆరోపించారు. బెదిరింపు ఫోన్​కాల్స్​ వస్తున్న సందర్భంలో ఇద్దరు గన్​మెన్లను తొలగించడమేంటని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం నాకు 2 + 2 భద్రత కల్పించిందని ఆయన తెలిపారు. శనివారం ఇద్దరు గన్​మెన్లను తొలగించారు. ఎవరి ఆదేశాలతో గన్​మెన్​లను తొలగించారని.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పనిదే ఈ పని చేయరని విమర్శించారు.

ప్రస్తుతం ఇద్దరు గన్​మెన్​లను తొలగించిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డి వివరించారు. ప్రభుత్వం ఇద్దరు గన్​మెన్​లను తొలగించగా.. మిగతా ఇద్దరి గన్​మెన్​లను.. తాను ప్రభుత్వానికి రిటర్న్​ గిఫ్ట్​ ఇస్తున్నానని అన్నారు. ఇద్దరు గన్​మెన్​లను తొలగిస్తే భయపడనని.. మిగిలిన ఇద్దర్ని గౌరవంగా ప్రభుత్వానికి అప్పగిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గన్​మెన్​ను స్వీకరించలేదని గుర్తు చేశారు.

ఎక్కడికైనా ఒంటరిగా వెళ్తాను: ఎక్కడికైనా ఒంటరిగా వెళ్తానని.. ఏం భయపడనని కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల గొంతుకే.. తన గొంతుక అని వివరించారు. సినిమా డైలాగులు చెప్పటం లేదని.. అసలు నిజమిదేనని తగ్గేదేలే అని హెచ్చరించారు. మరింత పట్టుదలతో ముందుకెళ్తానని అన్నారు. 175 సీట్లలో అన్నింటిలో విజయం సాధిస్తామని చెప్తున్నవారు.. ఒక్క ఎమ్మెల్యే వ్యతిరేకిస్తే మీకు ఇంతా భయమా అని ప్రశ్నించారు. ఒక్కడిని లక్ష్యంగా చేసుకుని బెదిరింపు కాల్స్​ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భద్రతా విషయంలో తన తలరాత ఏ విధంగా ఉంటే అలానే జరుగుతుంది: తాను పొరపాటు చేసి ఉంటే భగవంతుడు, ప్రజలు తనకు శిక్ష వేస్తారని కోటంరెడ్డి అన్నారు. తాను తప్పు చేయలేదని భావిస్తే అండగా ఉండాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. భద్రతా విషయంలో తన తలరాత ఏ విధంగా ఉంటే అలానే జరుగుతుందని పేర్కొన్నారు. ఇన్నాళ్లపాటు తనకు సెక్యూరిటీగా విధులు నిర్వర్తించిన ఇద్దరు సిబ్బందికి ఆయన వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన గన్‌మెన్లను గుండెలకు హత్తుకొని కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డి ఓదార్చారు.

"ఎక్కడికైనా ఒంటరిగా వెళ్తానని.. ఏం భయపడను. నేను పొరపాటు చేసి ఉంటే భగవంతుడు, ప్రజలు నాకు శిక్ష వేస్తారు. నేను తప్పు చేయలేదని భావిస్తే అండగా ఉండాలని ప్రజలను కోరుతున్నా. భద్రతా విషయంలో తన తలరాత ఏ విధంగా ఉంటే అలానే జరుగుతుంది." - కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డి, ఎమ్మెల్యే

ఇవీ చదవండి: ఈ నెలాఖరులో శాసనసభ రద్దు.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన: ఉత్తమ్​ కుమార్​రెడ్డి

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్​.. డీఏ 4శాతం పెంపు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.