ETV Bharat / state

'ఉపకులాల వర్గీకరణ ఆర్డినెన్స్​పై న్యాయపోరాటానికి సిద్ధం'

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రాష్ట్రాలే వర్గీకరించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందంటూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్​ను ఉపసంహరించుకోవాలని మాలమహానాడు జాతీయాధ్యక్షుడు చెన్నయ్య డిమాండ్​ చేశారు. ఉపకులాల వర్గీకరణ ఆర్డినెన్స్​కు వ్యతిరేకంగా హైదరాబాద్ మింట్ కాంపౌండ్​లోని అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు.

author img

By

Published : Aug 28, 2020, 3:12 PM IST

mala mahanadu leaders protested in hyderabad
ఉపకులాల వర్గీకరణను ఆర్డినెన్స్​ను ఉపసంహరించుకోవాలి:చెన్నయ్య

ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రాష్ట్రాలే వర్గీకరించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందంటూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్​ను ఆయన తప్పుబట్టారు. ఉపకులాల వర్గీకరణ ఆర్డినెన్స్​కు వ్యతిరేకంగా హైదరాబాద్ మింట్ కాంపౌండ్​లోని అంబేడ్కర్ విగ్రహం ముందు మాలమహానాడు నాయకులు నిరసన చేపట్టారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపకులాల వర్గీకరణ అధికారం ఇస్తే ఓటు బ్యాంకు కోసం వారు దుర్వినియోగం చేస్తారని చెన్నయ్య ఆరోపించారు.

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​ ఎస్సీ, ఎస్టీలకు సమాన అవకాశాలు కోసం రిజర్వేషన్లు తెస్తే రాజకీయ నాయకులు స్వలాభం కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్​ను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో 'ఛలో దిల్లీ' కార్యక్రమం చేపట్టడంతో పాటు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి న్యాయ పోరాటం చేస్తామని చెన్నయ్య స్పష్టం చేశారు.

ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రాష్ట్రాలే వర్గీకరించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందంటూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్​ను ఆయన తప్పుబట్టారు. ఉపకులాల వర్గీకరణ ఆర్డినెన్స్​కు వ్యతిరేకంగా హైదరాబాద్ మింట్ కాంపౌండ్​లోని అంబేడ్కర్ విగ్రహం ముందు మాలమహానాడు నాయకులు నిరసన చేపట్టారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపకులాల వర్గీకరణ అధికారం ఇస్తే ఓటు బ్యాంకు కోసం వారు దుర్వినియోగం చేస్తారని చెన్నయ్య ఆరోపించారు.

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​ ఎస్సీ, ఎస్టీలకు సమాన అవకాశాలు కోసం రిజర్వేషన్లు తెస్తే రాజకీయ నాయకులు స్వలాభం కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్​ను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో 'ఛలో దిల్లీ' కార్యక్రమం చేపట్టడంతో పాటు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి న్యాయ పోరాటం చేస్తామని చెన్నయ్య స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: నీటమునిగిన వరి, పత్తి పంటలు.. అన్నదాతల అగచాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.