ETV Bharat / state

'భిక్షం వేయడానికి మేము నిజాం అడుగు జాడల్లో నడవట్లేదు'

రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలు తెచ్చుకోవడానికి కేంద్రం చిన్న నిబంధనలు పెట్టిందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మూడు సంస్కరణలు అమలు చేసినా నిధులు తెచ్చుకోవచ్చని స్పష్టం చేశారు. భిక్షం వేయడానికి మేము నిజాం అడుగు జాడల్లో నడవట్లేదని మండిపడ్డారు.

author img

By

Published : May 19, 2020, 1:20 PM IST

kishan-reddy-talk-about-telangana-state-funds
'భిక్షం వేయడానికి మేము నిజాం అడుగు జాడల్లో నడవట్లేదు'

కేంద్ర ప్రభుత్వం నాలుగు సంస్కరణలు తీసుకువచ్చిందని... రాష్ట్రంలో మూడు సంస్కరణలు అమలు చేసినా నిధులు తెచ్చుకోవచ్చని హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. రుణాలు తెచ్చుకోవడానికి కేంద్రం చిన్న నిబంధనలు పెట్టిందని తెలిపారు. భిక్షం వేయడానికి మేము నిజాం అడుగు జాడల్లో నడవట్లేదని చెప్పారు. భిక్షం వేయడానికి కేంద్రం వద్ద డబ్బులుండాలి కదా అని మండిపడ్డారు. సమస్యలపై లేవనెత్తుతున్న ప్రతి అంశానికి జవాబు చెబుతామని స్పష్టం చేశారు.

విద్యుత్‌ అంతా ఒకే గ్రిడ్‌ కిందకు వచ్చినపుడు సంస్కరణలు తప్పనిసరని వెల్లడించారు. ఒక రాష్ట్రం సంస్కరణలు చేసి.. మరొకటి చేయకపోతే ప్రజలే నష్టపోతారని వివరించారు.

'భిక్షం వేయడానికి మేము నిజాం అడుగు జాడల్లో నడవట్లేదు'

ఇదీ చూడండి: కేసీఆర్..నీ భాష మార్చుకో....: కిషన్​రెడ్డి

కేంద్ర ప్రభుత్వం నాలుగు సంస్కరణలు తీసుకువచ్చిందని... రాష్ట్రంలో మూడు సంస్కరణలు అమలు చేసినా నిధులు తెచ్చుకోవచ్చని హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. రుణాలు తెచ్చుకోవడానికి కేంద్రం చిన్న నిబంధనలు పెట్టిందని తెలిపారు. భిక్షం వేయడానికి మేము నిజాం అడుగు జాడల్లో నడవట్లేదని చెప్పారు. భిక్షం వేయడానికి కేంద్రం వద్ద డబ్బులుండాలి కదా అని మండిపడ్డారు. సమస్యలపై లేవనెత్తుతున్న ప్రతి అంశానికి జవాబు చెబుతామని స్పష్టం చేశారు.

విద్యుత్‌ అంతా ఒకే గ్రిడ్‌ కిందకు వచ్చినపుడు సంస్కరణలు తప్పనిసరని వెల్లడించారు. ఒక రాష్ట్రం సంస్కరణలు చేసి.. మరొకటి చేయకపోతే ప్రజలే నష్టపోతారని వివరించారు.

'భిక్షం వేయడానికి మేము నిజాం అడుగు జాడల్లో నడవట్లేదు'

ఇదీ చూడండి: కేసీఆర్..నీ భాష మార్చుకో....: కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.