ETV Bharat / state

పట్టణ, గ్రామ రహదారులన్నీ నిర్మానుష్యం

author img

By

Published : Mar 23, 2020, 5:22 AM IST

Updated : Mar 23, 2020, 8:02 AM IST

రాష్ట్రంలో ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ... సంపూర్ణంగా బంద్ పాటించాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రజలంతా కేవలం ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతోనే గడిపారు. ఎప్పుడూ బిజీబిజీగా ఉండే ప్రజాప్రతినిధులు కూడా ఇంటిపట్టునే ఉండిపోయారు.

janatha-curfew-in-telangana
పట్టణ, గ్రామ రహదారులన్నీ నిర్మానుష్యం

జనతా కర్ఫ్యూలో ప్రజలంతా భాగస్వామ్యులయ్యారు. స్వీయ నిర్బంధంలోనే గడిపారు. అత్యవసర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిని మాత్రమే మినహాయించారు. పోలీసులు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందిని మాత్రమే జనతా కర్ఫ్యూ నుంచి మినహాయించారు. మిగిలిన వర్గాలన్ని పూర్తిగా ఇంటికే పరిమితం చేశారు. రైళ్లను పరిమితంగా మాత్రమే నడిపించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ ప్రధాన రైల్వే స్టేషన్లన్నీ బోసిపోయాయి. ప్రధాన మార్కెట్లు, రోడ్లు అన్నీ వెలవెలబోయాయి.

ఆర్టీసీ బస్సులు కేవలం డిపోలకే పరిమితం అయ్యాయి. క్యాబ్​లు, ఆటోలు, ప్రైవేటు వాహనాలు కూడా రోడ్లపై పెద్దగా కన్పించలేదు. వర్తకులంతా జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. చిరు వ్యాపారులు కూడా కన్పించలేదు. హైదరాబాద్ మహానగరంలోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. కూరగాయల మార్కెట్లనూ మూసేశారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో సాధారణ ప్రజలంతా అత్యవసర విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి సంఘీభావంగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేశారు.

పట్టణ, గ్రామ రహదారులన్నీ నిర్మానుష్యం

ఇవీ చూడండి: మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్‌

జనతా కర్ఫ్యూలో ప్రజలంతా భాగస్వామ్యులయ్యారు. స్వీయ నిర్బంధంలోనే గడిపారు. అత్యవసర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిని మాత్రమే మినహాయించారు. పోలీసులు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందిని మాత్రమే జనతా కర్ఫ్యూ నుంచి మినహాయించారు. మిగిలిన వర్గాలన్ని పూర్తిగా ఇంటికే పరిమితం చేశారు. రైళ్లను పరిమితంగా మాత్రమే నడిపించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ ప్రధాన రైల్వే స్టేషన్లన్నీ బోసిపోయాయి. ప్రధాన మార్కెట్లు, రోడ్లు అన్నీ వెలవెలబోయాయి.

ఆర్టీసీ బస్సులు కేవలం డిపోలకే పరిమితం అయ్యాయి. క్యాబ్​లు, ఆటోలు, ప్రైవేటు వాహనాలు కూడా రోడ్లపై పెద్దగా కన్పించలేదు. వర్తకులంతా జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. చిరు వ్యాపారులు కూడా కన్పించలేదు. హైదరాబాద్ మహానగరంలోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. కూరగాయల మార్కెట్లనూ మూసేశారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో సాధారణ ప్రజలంతా అత్యవసర విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి సంఘీభావంగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేశారు.

పట్టణ, గ్రామ రహదారులన్నీ నిర్మానుష్యం

ఇవీ చూడండి: మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్‌

Last Updated : Mar 23, 2020, 8:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.