ETV Bharat / state

ఇంటర్​ బోర్డు చిన్న చూపు.. మారని కామర్స్​ - Inter board Short View Unchanged Commerce pattern in telangana

ఉద్యోగ మార్కెట్లో కామర్స్​ విద్యార్థులకు డిమాండ్​ పెరుగుతున్నా ఇంటర్​ బోర్డు మాత్రం ఆ సబ్జెక్టుపై శీతకన్ను వేస్తోంది. కామర్స్​ గ్రూపులను బలోపేతం చేయకుండా అశ్రద్ధ వహిస్తోందన్న విమర్శలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్​ బోర్డు చిన్న చూపు.. మారని కామర్స్​
author img

By

Published : Nov 16, 2019, 7:38 AM IST

ఇంటర్​ నుంచే కామర్స్ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తే విద్యార్థులకు అధిక ప్రయోజనమని అధ్యాపకులు, నిపుణులు చెబుతున్నా ఇంటర్​ బోర్డు పట్టించుకోవడం లేదు. కామర్స్​ విభాగంలో సంప్రదాయ డిగ్రీ చదివినా కొలువులు దొరుకుతాయి. ఇతర ఏ సబ్జెక్టుకూ లేని ప్రత్యేకత అది.

వాణిజ్యశాస్త్రం విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు
ఎంపీసీ, బైపీసీ గ్రూపుల పాఠ్య ప్రణాళికను జాతీయ ప్రవేశ పరీక్షలకు అనుగుణంగా సీబీఎస్​ఈతో పోటీగా రూపొందిస్తున్న బోర్డు, వాణిజ్యశాస్త్రం దగ్గరకు వచ్చే సరికి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. డిమాండ్​ను గుర్తించి సీబీఎస్​ఈ, ఐసీఎస్​సీ బోర్డులు కామర్స్​ సబ్జెక్టును మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం కనీస సంస్కరణలు తీసుకురావడం లేదు.

విద్యార్థులకు ప్రయోజనం
నిపుణులు కమిటీని నియమించి సబ్జెక్టును మరింత బలోపేతం చేస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ఓయూ కామర్స్​ విభాగం విశ్రాంత ఆచార్యుడు ఎస్​వీ సత్యనారాయణ, గజ్వేల్​ డిగ్రీ, పీజీ ప్రభుత్వ కళాశాల సహాయ ఆచార్యుడు గోపాల సుదర్శనం సూచిస్తున్నారు.

గణితానికి మాత్రం ఒక్కోటి 50 మార్కులకు
సీఈసీ(పౌర, ఆర్థిక, వాణిజ్య శాస్ర్తాలు), ఎంఈసీ (గణితం, ఆర్థిక, వాణిజ్య శాస్త్రాలు) గ్రూపుల్లో కామార్స్​ ప్రధాన సబ్జైక్టు, కామర్స్​లో వాణిజ్య శాస్త్రంతో పాటు గణాంక శాస్ర్తం(అకౌంటెన్సీ)అనే రెండు పుస్తకాలు ఉంటాయి. ఆ రెండింటికి కలిపి 100 మార్కులకు ఒకటే పరీక్ష. ఎంఈసీలో గణితానికి మాత్రం ఒక్కోటి 50 మార్కులకు రెండు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాణిజ్య శాస్త్రానికి కూడా రెండు పరీక్షలు నిర్వహించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం ఛాయిస్​ కింద కొన్ని అధ్యాయాలను బోధించడం లేదు. ఆ పరిస్థితికి అడ్డుకట్ట పడుతుంది.

ఎంపీసీ విద్యార్థులకు ఇచ్చే గణితం ప్రశ్న పత్రాన్నే ఎంఈసీ వారికి ఇస్తున్నారు. ఎంఈసీ విద్యార్థులు బీకాం లేదా సీఏ కోర్సులు చదువుతారు. వారికి ఎంపీసీ విద్యార్థుల తరహాలో కాకుండా కామర్స్​ రంగానికి అవసరమైన కొన్ని అధ్యాయాలనైనా గణితంలో చేరిస్తే ప్రయోజనం ఉంటుంది.

ఇదీ చూడండి : బాధిత ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు తెదేపా ఆర్థికసాయం

ఇంటర్​ నుంచే కామర్స్ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తే విద్యార్థులకు అధిక ప్రయోజనమని అధ్యాపకులు, నిపుణులు చెబుతున్నా ఇంటర్​ బోర్డు పట్టించుకోవడం లేదు. కామర్స్​ విభాగంలో సంప్రదాయ డిగ్రీ చదివినా కొలువులు దొరుకుతాయి. ఇతర ఏ సబ్జెక్టుకూ లేని ప్రత్యేకత అది.

వాణిజ్యశాస్త్రం విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు
ఎంపీసీ, బైపీసీ గ్రూపుల పాఠ్య ప్రణాళికను జాతీయ ప్రవేశ పరీక్షలకు అనుగుణంగా సీబీఎస్​ఈతో పోటీగా రూపొందిస్తున్న బోర్డు, వాణిజ్యశాస్త్రం దగ్గరకు వచ్చే సరికి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. డిమాండ్​ను గుర్తించి సీబీఎస్​ఈ, ఐసీఎస్​సీ బోర్డులు కామర్స్​ సబ్జెక్టును మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం కనీస సంస్కరణలు తీసుకురావడం లేదు.

విద్యార్థులకు ప్రయోజనం
నిపుణులు కమిటీని నియమించి సబ్జెక్టును మరింత బలోపేతం చేస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ఓయూ కామర్స్​ విభాగం విశ్రాంత ఆచార్యుడు ఎస్​వీ సత్యనారాయణ, గజ్వేల్​ డిగ్రీ, పీజీ ప్రభుత్వ కళాశాల సహాయ ఆచార్యుడు గోపాల సుదర్శనం సూచిస్తున్నారు.

గణితానికి మాత్రం ఒక్కోటి 50 మార్కులకు
సీఈసీ(పౌర, ఆర్థిక, వాణిజ్య శాస్ర్తాలు), ఎంఈసీ (గణితం, ఆర్థిక, వాణిజ్య శాస్త్రాలు) గ్రూపుల్లో కామార్స్​ ప్రధాన సబ్జైక్టు, కామర్స్​లో వాణిజ్య శాస్త్రంతో పాటు గణాంక శాస్ర్తం(అకౌంటెన్సీ)అనే రెండు పుస్తకాలు ఉంటాయి. ఆ రెండింటికి కలిపి 100 మార్కులకు ఒకటే పరీక్ష. ఎంఈసీలో గణితానికి మాత్రం ఒక్కోటి 50 మార్కులకు రెండు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాణిజ్య శాస్త్రానికి కూడా రెండు పరీక్షలు నిర్వహించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం ఛాయిస్​ కింద కొన్ని అధ్యాయాలను బోధించడం లేదు. ఆ పరిస్థితికి అడ్డుకట్ట పడుతుంది.

ఎంపీసీ విద్యార్థులకు ఇచ్చే గణితం ప్రశ్న పత్రాన్నే ఎంఈసీ వారికి ఇస్తున్నారు. ఎంఈసీ విద్యార్థులు బీకాం లేదా సీఏ కోర్సులు చదువుతారు. వారికి ఎంపీసీ విద్యార్థుల తరహాలో కాకుండా కామర్స్​ రంగానికి అవసరమైన కొన్ని అధ్యాయాలనైనా గణితంలో చేరిస్తే ప్రయోజనం ఉంటుంది.

ఇదీ చూడండి : బాధిత ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు తెదేపా ఆర్థికసాయం

Intro:Body:

intermediate


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.