ETV Bharat / state

'నార్మలైజేషన్ పద్ధతిని తక్షణమే రద్దుచేయాలి'

author img

By

Published : Oct 26, 2019, 11:51 PM IST

Updated : Oct 26, 2019, 11:59 PM IST

కానిస్టేబుల్ ఎంపిక పక్రియలో తీసుకున్న నార్మలైజేషన్ పద్ధతిని తక్షణమే రద్దుచేయాలని పలువురు అభ్యర్థులు డిమాండ్​ చేశారు. ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఆరుగురు కానిస్టేబుల్ అభ్యర్థులకు...  కొవ్వొత్తులతో గన్ పార్క్ వద్ద నివాళి అర్పించి మౌనం పాటించారు.

'నార్మలైజేషన్ పద్ధతిని తక్షణమే రద్దుచేయాలి'

కానిస్టేబుల్ ఎంపిక పక్రియలో తీసుకున్న నార్మలైజేషన్ పద్ధతిని తక్షణమే రద్దుచేయాలని పలువురు అభ్యర్థులు డిమాండ్​ చేశారు. ఈ పద్ధతితో అర్హత కలిగిన తాము తీవ్రంగా నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అవకతవకల వల్లనే ఆరుగురు అభ్యర్థులు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న వారికి కొవ్వొత్తులతో గన్​పార్క్ వద్ద నివాళి అర్పించి మౌనం పాటించారు.

నార్మలైజేషన్ పద్ధతి వల్ల 110 మార్కులు సాధించిన అభ్యర్థులకు 90 మార్కులు వేసి అనర్హులుగా ప్రకటించడాన్ని వారు తప్పుపట్టారు. కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పటికి సెలెక్షన్ లిస్టులో అర్హులైన వారి పేర్లు లేవని తెలిపారు. ఈ వ్యవహారంపై నవంబర్ 5న న్యాయస్థానం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో... రిక్రూట్ మెంట్ బోర్డ్ అవకతవకలను సరిచేసి మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అభ్యర్థులందరం ఆమరణ నిరాహారదీక్షకు దిగుతామని వారు హెచ్చరించారు.

'నార్మలైజేషన్ పద్ధతిని తక్షణమే రద్దుచేయాలి'

ఇదీ చూడండి : ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

కానిస్టేబుల్ ఎంపిక పక్రియలో తీసుకున్న నార్మలైజేషన్ పద్ధతిని తక్షణమే రద్దుచేయాలని పలువురు అభ్యర్థులు డిమాండ్​ చేశారు. ఈ పద్ధతితో అర్హత కలిగిన తాము తీవ్రంగా నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అవకతవకల వల్లనే ఆరుగురు అభ్యర్థులు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న వారికి కొవ్వొత్తులతో గన్​పార్క్ వద్ద నివాళి అర్పించి మౌనం పాటించారు.

నార్మలైజేషన్ పద్ధతి వల్ల 110 మార్కులు సాధించిన అభ్యర్థులకు 90 మార్కులు వేసి అనర్హులుగా ప్రకటించడాన్ని వారు తప్పుపట్టారు. కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పటికి సెలెక్షన్ లిస్టులో అర్హులైన వారి పేర్లు లేవని తెలిపారు. ఈ వ్యవహారంపై నవంబర్ 5న న్యాయస్థానం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో... రిక్రూట్ మెంట్ బోర్డ్ అవకతవకలను సరిచేసి మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అభ్యర్థులందరం ఆమరణ నిరాహారదీక్షకు దిగుతామని వారు హెచ్చరించారు.

'నార్మలైజేషన్ పద్ధతిని తక్షణమే రద్దుచేయాలి'

ఇదీ చూడండి : ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

TG_Hyd_41_26_ Constable Candidates At Gun Park_Ab_TS10005_Re Note: Feed Ftp Contributor: Bhushanam యాంకర్ : కానిస్టేబుల్ ఎంపిక పక్రియ లో తీసుకున్న నార్మలైజేషన్ పద్ధతిని తక్షణమే రద్దుచేసి... మెరిట్ మార్కులతో అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయం చేయాలని పలువురు అభ్యర్థులు హైదరాబాద్ లో డిమాండ్ చేశారు. ఈ పద్ధతితో అర్హత కలిగిన తాము తీవ్రంగా నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఆరుగురు కానిస్టేబుల్ అభ్యర్థులకు... కొవ్వొత్తులతో గన్ పార్క్ వద్ద నివాళ్ళు అర్పించి మౌనం పాటించారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ అవకతవకల వల్లనే అభ్యర్థులు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నార్మలైజేషన్ పద్ధతి వల్ల 110 మార్కులు సాధించిన అభ్యర్థులకు 90 మార్కులు వేసి అనర్హులుగా ప్రకటించడాన్ని వారు తప్పుపట్టారు. టీఎస్ పీఎల్ ఎఆర్బీ వెల్లడించిన కానిస్టేబుల్ ఫలితాలలో వారు పెట్టిన కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పటికి సెలెక్షన్ లిస్టులో అర్హులైన వారి పేర్లు లేవని తెలిపారు. ఈ వ్యవహారం పై నవంబర్ 5న న్యాయస్థానం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో... రిక్రూట్ మెంట్ బోర్డ్ అవకతవకలను సరిచేసి మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అభ్యర్థులందరం ఆమరణ నిరాహారదీక్షకు దిగుతామని వారు హెచ్చరించారు. బైట్ : శ్రవణ్ ( అభ్యర్థి ) బైట్ : వెంకటమ్మా ( అభ్యర్థి )
Last Updated : Oct 26, 2019, 11:59 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.