ETV Bharat / state

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు - ఇంటర్‌ బోర్డు కార్యదర్శిగా శ్రుతి ఓజా

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2023, 9:04 PM IST

Updated : Dec 24, 2023, 10:01 PM IST

IAS Officers Transfer in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు ఐఏఎస్‌ అధికారులు, ఒక ఐపీఎస్‌ అధికారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు సీఎస్‌ ఉత్తర్వులను జారీ చేశారు. ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శిగా శ్రుతి ఓజాను నియమించారు.

IAS Officers Transfer in Telangana
Many IAS Officers Transfer in Telangana

IAS Officers Transfer in Telangana : రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. నేడు మరో ఆరుగురు సీనియర్‌ ఐఏఎస్‌, ఒక ఐపీఎస్‌ అధికారిని(IAS Transfers) బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ కమిషనర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్‌ను బదిలీ చేసి రవాణా శాఖ కమిషనర్ గా నియమించారు. ఎక్సైజ్ కమిషనర్‌గా ఇ. శ్రీధర్ నియమించిన ప్రభుత్వం టీఎస్ఐఐసీ వీసీఎండీగా అదనపు బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించింది.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతీ హొలికేరిని బదిలీ చేసిన ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా మేడ్చల్ కలెక్టర్ గౌతం పొత్రుకు అదనపు బాధ్యతలు కేటాయించారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా శ్రుతి ఓజా నియమితులయ్యారు. ఇ.వి.నర్సింహారెడ్డిని టీఎస్ఐఐసీ ఎండీ బాధ్యతలను నుంచి బదిలీ చేసి గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడిగా ప్రభుత్వం నియమించింది. ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్‌ను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

అధికారుల బదిలీలు వివరాలు :

  • రవాణాశాఖ కమిషనర్‌ జ్యోతి బుద్దప్రకాశ్‌
  • ఎక్సైజ్‌ కమిషనర్‌గా ఇ.శ్రీధర్‌ను నియమించగా, అదనపు బాధ్యతగా టీఎస్‌ఐఐసీ ఎండీగా నియామకం
  • రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న భారతి హోలికేరిని సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని ఆదేశం
  • రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా గౌతమ్‌
  • ఇంటర్‌ బోర్డు కార్యదర్శిగా శ్రుతి ఓజాకు బాధ్యతలు
  • గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌గా ఈవీ నరసింహారెడ్డి నియామకం
  • పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా డీఎస్‌ చౌహాన్‌ నియామకం

ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా రిజ్వీ - రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు

IPS Officers Transfer in Telangana : ఈనెల 12వ తేదీన పలువురు ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అందులో హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డిని నియమించారు. అంతముందు సీపీగా ఉన్న సందీప్‌ శాండిల్యను టీఎస్‌ న్యాబ్‌ డైరెక్టర్‌గా బదిలీపై పంపించారు. సైబరాబాద్‌ సీపీగా అవినాశ్‌ మహంతి బదిలీ అయి, విధులు నిర్వహిస్తున్నారు. ఆ స్థానంలో ఉన్న స్టీఫెన్‌ రవీంద్రను డీజీపీ కార్యాలయానికి పంపించారు. రాచకొండ సీపీగా సుధీర్‌బాబు బదిలీపై వెళ్లారు.

ప్రస్తుతం డీఎస్‌ చౌహాన్‌ను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా నియమితులైయ్యారు. అలాగే గత ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారినీ ప్రభుత్వం స్థానచలనం కలిగించింది. పూర్తిస్థాయి డీజీపీగా రవి గుప్తాను నియమించింది. ఎన్నికల కమిషన్‌ సస్పెండ్‌తో డీజీపీ బాధ్యతల నుంచి అంజనీకుమార్‌ తప్పుకున్నారు. అప్పటి నుంచి రవిగుప్తానే డీజీపీగా కొనసాగుతూ వచ్చారు. ఇప్పడు పూర్తిస్థాయి డీజీపీగా నిధులు నిర్వర్తిస్తున్నారు.

పాలనను పరుగులు పెట్టించే దిశగా ఆలోచన - త్వరలోనే అధికార యంత్రాంగ ప్రక్షాళణ

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ - హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

IAS Officers Transfer in Telangana : రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. నేడు మరో ఆరుగురు సీనియర్‌ ఐఏఎస్‌, ఒక ఐపీఎస్‌ అధికారిని(IAS Transfers) బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ కమిషనర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్‌ను బదిలీ చేసి రవాణా శాఖ కమిషనర్ గా నియమించారు. ఎక్సైజ్ కమిషనర్‌గా ఇ. శ్రీధర్ నియమించిన ప్రభుత్వం టీఎస్ఐఐసీ వీసీఎండీగా అదనపు బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించింది.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతీ హొలికేరిని బదిలీ చేసిన ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా మేడ్చల్ కలెక్టర్ గౌతం పొత్రుకు అదనపు బాధ్యతలు కేటాయించారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా శ్రుతి ఓజా నియమితులయ్యారు. ఇ.వి.నర్సింహారెడ్డిని టీఎస్ఐఐసీ ఎండీ బాధ్యతలను నుంచి బదిలీ చేసి గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడిగా ప్రభుత్వం నియమించింది. ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్‌ను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

అధికారుల బదిలీలు వివరాలు :

  • రవాణాశాఖ కమిషనర్‌ జ్యోతి బుద్దప్రకాశ్‌
  • ఎక్సైజ్‌ కమిషనర్‌గా ఇ.శ్రీధర్‌ను నియమించగా, అదనపు బాధ్యతగా టీఎస్‌ఐఐసీ ఎండీగా నియామకం
  • రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న భారతి హోలికేరిని సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని ఆదేశం
  • రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా గౌతమ్‌
  • ఇంటర్‌ బోర్డు కార్యదర్శిగా శ్రుతి ఓజాకు బాధ్యతలు
  • గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌గా ఈవీ నరసింహారెడ్డి నియామకం
  • పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా డీఎస్‌ చౌహాన్‌ నియామకం

ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా రిజ్వీ - రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు

IPS Officers Transfer in Telangana : ఈనెల 12వ తేదీన పలువురు ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అందులో హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డిని నియమించారు. అంతముందు సీపీగా ఉన్న సందీప్‌ శాండిల్యను టీఎస్‌ న్యాబ్‌ డైరెక్టర్‌గా బదిలీపై పంపించారు. సైబరాబాద్‌ సీపీగా అవినాశ్‌ మహంతి బదిలీ అయి, విధులు నిర్వహిస్తున్నారు. ఆ స్థానంలో ఉన్న స్టీఫెన్‌ రవీంద్రను డీజీపీ కార్యాలయానికి పంపించారు. రాచకొండ సీపీగా సుధీర్‌బాబు బదిలీపై వెళ్లారు.

ప్రస్తుతం డీఎస్‌ చౌహాన్‌ను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా నియమితులైయ్యారు. అలాగే గత ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారినీ ప్రభుత్వం స్థానచలనం కలిగించింది. పూర్తిస్థాయి డీజీపీగా రవి గుప్తాను నియమించింది. ఎన్నికల కమిషన్‌ సస్పెండ్‌తో డీజీపీ బాధ్యతల నుంచి అంజనీకుమార్‌ తప్పుకున్నారు. అప్పటి నుంచి రవిగుప్తానే డీజీపీగా కొనసాగుతూ వచ్చారు. ఇప్పడు పూర్తిస్థాయి డీజీపీగా నిధులు నిర్వర్తిస్తున్నారు.

పాలనను పరుగులు పెట్టించే దిశగా ఆలోచన - త్వరలోనే అధికార యంత్రాంగ ప్రక్షాళణ

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ - హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

Last Updated : Dec 24, 2023, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.