ETV Bharat / state

నేరస్థుల పాలిట సింహ స్వప్నంగా రాచకొండ కమిషనరేట్​

author img

By

Published : Dec 17, 2020, 7:27 PM IST

Updated : Dec 17, 2020, 7:38 PM IST

నేరస్థులను కటకటాల్లోకి నెట్టడంలో రాచకొండ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 10 నెలల్లో 62 కేసులు దర్యాప్తు పూర్తి చేసి, 89 మంది నేరగాళ్లకు శిక్షలు పడేలా చేసి రికార్డు సృష్టించారు. నేరం చేయాలంటేనే భయపడేలా దర్యాప్తులో వేగం పెంచటమే కాక.. పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలతో సహా నేరస్థులను బోనులో నిలబెడుతున్నారు. నేరాలు చేయాలంటేనే భయం నెలకొందని పోలీస్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

నేరస్థులపాలిట సింహ స్వప్నంగా రాచకొండ కమిషనరేట్​
నేరస్థులపాలిట సింహ స్వప్నంగా రాచకొండ కమిషనరేట్​
నేరస్థుల పాలిట సింహ స్వప్నంగా రాచకొండ కమిషనరేట్​

రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిందితులకు పోలీసులు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద కమిషనరేట్ పరిధిలో పోలీసులు కన్విక్షన్ రేట్‌లో సత్తా చాటుతున్నారు. సాంకేతికత ఉపయోగించి సాక్ష్యాలు సేకరణ, విచారణ వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా నిందితులకు శిక్షలు ఖరారయ్యేలా చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే పలు కీలక కేసుల్లో 62 మంది నిందితులకు శిక్షలు పడ్డాయి. ఇందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని, కోర్టు సిబ్బందిని సీపీ మహేష్ భగవత్ అభినందించారు.

చిక్కితే శిక్ష పక్కా..

ముఖ్యంగా గతేడాది ఆగస్టులో మహేశ్వరం ఠాణా పరిధిలో ఇటుక బట్టీలో పని చేస్తున్న ఒడిశాాకు చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు నిందితులకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2018 కీసరలో ఆభరణాల దుకాణంలో తుపాకులతో బెదిరించి చోరీ చేసిన కేసులో నిందితులు నలుగురికి ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఇలా పలు కీలక కేసుల్లో సాక్షాధారాలను సేకరించి నిందితులకు శిక్షలు పడేలా రాచకొండ పోలీసులు వ్యవహరించారు.

భద్రతతోనే రాష్ట్రాభివృద్ధి..

రాచకొండ పోలీసులు కృషిపై అదనపు డీజీపీ జితేందర్ సంతృప్తి వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు అదుపులో ఉంచడం వల్లే రాష్ట్రం వేగంగా అభివృద్ది చెందుతోందని వివరించారు. బాధితుడికి అన్యాయం జరగకుండా చూడటమే లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేస్తున్నట్లు వెల్లడించారు. పోలీసులు శ్రమ వల్లే నేరస్థులకు త్వరగా శిక్షలు పడుతున్నాయని రాష్ట్ర ప్రాసిక్యూషన్ డైరెక్టర్ వైజయంతి తెలిపారు.

విచారణలో వేగవంతం లేకపోతే శిక్షలు పడటం ఆలస్యమవుతుందన్న పోలీసు ఉన్నతాధికారులు.. దర్యాప్తును వేగంగా పూర్తిచేసిన సిబ్బందిని సత్కరించడం సముచితమని కొనియాడారు.

ఇదీ చూడండి: ఆరేళ్లలో టీఎస్‌పీఎస్సీపై ఒక్క ఆరోపణ కూడా రాలేదు: సీఎస్

నేరస్థుల పాలిట సింహ స్వప్నంగా రాచకొండ కమిషనరేట్​

రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిందితులకు పోలీసులు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద కమిషనరేట్ పరిధిలో పోలీసులు కన్విక్షన్ రేట్‌లో సత్తా చాటుతున్నారు. సాంకేతికత ఉపయోగించి సాక్ష్యాలు సేకరణ, విచారణ వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా నిందితులకు శిక్షలు ఖరారయ్యేలా చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే పలు కీలక కేసుల్లో 62 మంది నిందితులకు శిక్షలు పడ్డాయి. ఇందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని, కోర్టు సిబ్బందిని సీపీ మహేష్ భగవత్ అభినందించారు.

చిక్కితే శిక్ష పక్కా..

ముఖ్యంగా గతేడాది ఆగస్టులో మహేశ్వరం ఠాణా పరిధిలో ఇటుక బట్టీలో పని చేస్తున్న ఒడిశాాకు చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు నిందితులకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2018 కీసరలో ఆభరణాల దుకాణంలో తుపాకులతో బెదిరించి చోరీ చేసిన కేసులో నిందితులు నలుగురికి ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఇలా పలు కీలక కేసుల్లో సాక్షాధారాలను సేకరించి నిందితులకు శిక్షలు పడేలా రాచకొండ పోలీసులు వ్యవహరించారు.

భద్రతతోనే రాష్ట్రాభివృద్ధి..

రాచకొండ పోలీసులు కృషిపై అదనపు డీజీపీ జితేందర్ సంతృప్తి వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు అదుపులో ఉంచడం వల్లే రాష్ట్రం వేగంగా అభివృద్ది చెందుతోందని వివరించారు. బాధితుడికి అన్యాయం జరగకుండా చూడటమే లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేస్తున్నట్లు వెల్లడించారు. పోలీసులు శ్రమ వల్లే నేరస్థులకు త్వరగా శిక్షలు పడుతున్నాయని రాష్ట్ర ప్రాసిక్యూషన్ డైరెక్టర్ వైజయంతి తెలిపారు.

విచారణలో వేగవంతం లేకపోతే శిక్షలు పడటం ఆలస్యమవుతుందన్న పోలీసు ఉన్నతాధికారులు.. దర్యాప్తును వేగంగా పూర్తిచేసిన సిబ్బందిని సత్కరించడం సముచితమని కొనియాడారు.

ఇదీ చూడండి: ఆరేళ్లలో టీఎస్‌పీఎస్సీపై ఒక్క ఆరోపణ కూడా రాలేదు: సీఎస్

Last Updated : Dec 17, 2020, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.