ETV Bharat / state

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది కేసీఆరే: ఈటల

author img

By

Published : Feb 2, 2023, 4:46 PM IST

Etela Rajender fires on CM Kcr: దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం కల్గిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్ర అప్పులు ఆదాయంపై లెక్కలకు సిద్ధమా అని కేటీఆర్‌కు సవాలు విసిరారు. ప్రభుత్వం ఉచితంగా 24గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.

Etela Rajender
Etela Rajender

Etela Rajender fires on CM Kcr: కేంద్రం పెట్టిన 45లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌లో 10లక్షల కోట్లు మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించడం సాహసోపేతమైన నిర్ణయమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఈటల... కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని విమర్శించారు. రాష్ట్ర అప్పులు ఆదాయంపై లెక్కలకు సిద్ధమా అని కేటీఆర్‌కు సవాలు విసిరారు.

అది నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం కల్గిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఈటల రాజేందర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ తమ శాఖలపై ఒక్కసారైనా సమీక్ష చేశారో లేదో మంత్రులు గ్రహించాలన్నారు. తెలంగాణలో ఎక్కడికైనా వస్తా 24 గంటలు కరెంట్ ఇచ్చేది నిరూపించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉచితంగా 24గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. ఉద్యోగుల జీతాలు, జీపీఎఫ్ ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. సీఎంను ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసే పరిస్థితి లేదని ఈటల రాజేందర్ తనదైన శైలిలో సీఎం కేసీఆర్​పై ఆరోపణలు గుప్పించారు.

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది కేసీఆరే: 2014లో తమ ఆస్తులు ఎన్ని.. 2023లో ఎన్ని ఆస్తులో చర్చకు సిద్ధమా అని కేసీఆర్​కు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దింది తాను కాదని.. కేసీఆరే అన్నారు. తాను తెరాసకు రాజీనామా చేసి పోలేదన్న ఈటల... కేసీఆరే తనను పార్టీ నుంచి వెళ్లగొట్టారని ఆరోపించారు. ఈ విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసని ఈటల అన్నారు. టికెట్ ఇచ్చిన ఎన్టీఆర్​కు వెన్నుపోటు పొడిచింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. 13 నెలల నుంచి తనను సభకు రానివ్వడం లేదన్నారు. ఎమ్మెల్యేల గౌరవానికి భంగం కలిగిస్తే శిలాఫలకాలు పగలకొడుతామని ఈటల రాజేందర్ హెచ్చరించారు.

టికెటిచ్చిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది కేసీఆరే: ఈటల

'రాష్ట్రంలో ఎక్కడికైనా వస్తా 24 గంటలు కరెంట్ ఇచ్చేది నిరూపించాలి. 24గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఉద్యోగులకు జీతాలు, జీపీఎఫ్ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. సీఎంను ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసే పరిస్థితి లేదు. టికెట్ ఇచ్చిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది కేసీఆర్ కాదా?.' -ఈటల రాజేందర్, హుజురాబాద్ ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

Etela Rajender fires on CM Kcr: కేంద్రం పెట్టిన 45లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌లో 10లక్షల కోట్లు మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించడం సాహసోపేతమైన నిర్ణయమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఈటల... కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని విమర్శించారు. రాష్ట్ర అప్పులు ఆదాయంపై లెక్కలకు సిద్ధమా అని కేటీఆర్‌కు సవాలు విసిరారు.

అది నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం కల్గిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఈటల రాజేందర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ తమ శాఖలపై ఒక్కసారైనా సమీక్ష చేశారో లేదో మంత్రులు గ్రహించాలన్నారు. తెలంగాణలో ఎక్కడికైనా వస్తా 24 గంటలు కరెంట్ ఇచ్చేది నిరూపించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉచితంగా 24గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. ఉద్యోగుల జీతాలు, జీపీఎఫ్ ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. సీఎంను ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసే పరిస్థితి లేదని ఈటల రాజేందర్ తనదైన శైలిలో సీఎం కేసీఆర్​పై ఆరోపణలు గుప్పించారు.

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది కేసీఆరే: 2014లో తమ ఆస్తులు ఎన్ని.. 2023లో ఎన్ని ఆస్తులో చర్చకు సిద్ధమా అని కేసీఆర్​కు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దింది తాను కాదని.. కేసీఆరే అన్నారు. తాను తెరాసకు రాజీనామా చేసి పోలేదన్న ఈటల... కేసీఆరే తనను పార్టీ నుంచి వెళ్లగొట్టారని ఆరోపించారు. ఈ విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసని ఈటల అన్నారు. టికెట్ ఇచ్చిన ఎన్టీఆర్​కు వెన్నుపోటు పొడిచింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. 13 నెలల నుంచి తనను సభకు రానివ్వడం లేదన్నారు. ఎమ్మెల్యేల గౌరవానికి భంగం కలిగిస్తే శిలాఫలకాలు పగలకొడుతామని ఈటల రాజేందర్ హెచ్చరించారు.

టికెటిచ్చిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది కేసీఆరే: ఈటల

'రాష్ట్రంలో ఎక్కడికైనా వస్తా 24 గంటలు కరెంట్ ఇచ్చేది నిరూపించాలి. 24గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఉద్యోగులకు జీతాలు, జీపీఎఫ్ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. సీఎంను ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసే పరిస్థితి లేదు. టికెట్ ఇచ్చిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది కేసీఆర్ కాదా?.' -ఈటల రాజేందర్, హుజురాబాద్ ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.