ETV Bharat / state

Telangana Rains Today : వానలే వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

author img

By

Published : Jul 19, 2023, 2:07 PM IST

Updated : Jul 19, 2023, 3:32 PM IST

Telangana Rain Alert Today : రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రాజధానితో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానల కారణంగా ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరోవైపు వచ్చే మూడు రోజులూ పరిస్థితులు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Rains In Telangana
Rains In Telangana
వానలే వానలు పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

Rains In Telangana Toady : రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రజలు అవస్థలు పడ్డారు. బేగంబజార్, కోఠి, సుల్తాన్​బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్​బాగ్, లిబర్టీ, నారాయణగూడ, హిమాయత్‌నగర్, లక్డీకపూల్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. ఈ క్రమంలోనే రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 5 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. పలుచోట్ల తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోయాయి. లో లెవల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో.. పలు గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. ప్రాజెక్టుల్లోకి ప్రవాహం పెరుగుతోంది. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నవీపేట్ మండలంలోని జన్నేపల్లి పెద్ద చెరువు అలుగు పారుతుంది. నిజామాబాద్ నగర శివారులోని గూపన్‌పల్లి ఉన్నత పాఠశాల.. వరద నీటితో చెరువును తలపిస్తోంది. పాఠశాల మొత్తం నీటితో నిండిపోయి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నీటిలో నుంచే రాకపోకలు సాగించాల్సి రావడం వల్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.

Heavy Rain Alert To Telangana : మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జోరు వాన కురుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టులు, చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి. సత్తుపల్లిలో ఎడతెరిపి లేని వర్షాలకు బేతుపల్లి చెరువుకు వరద ప్రవాహం పెరిగింది. భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లందు, కోయగూడెంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది.

Weather Updates : రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. రైతన్నల్లో చిగురిస్తోన్న ఆశలు

Rains in Telangana 2023 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు జలాశయాల్లోకి చేరడంతో అవి జలకళ సంతరించుకుంటున్నాయి. వరంగల్‌ పైడిపల్లిలో వర్షాల ధాటికి ఓ పాత ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది శిథిలాల నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు.

Telangana Rains Toady : వర్షాల వల్ల భూపాలపల్లి సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లోని కేటీకే 2,3 గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. తద్వారా 7,025 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. ఫలితంగా రూ.1.72 కోట్ల నష్టం వాటిల్లింది. 1.63 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత వర్షం కారణంగా ఆగిపోయింది. గనిలో నిలిచిన వర్షపు నీటిని భారీ పంపుల ద్వారా బయటకు పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. వచ్చే 3 రోజులూ రాష్ట్రంలో పరిస్థితులు ఇలాగే ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఇవీ చదవండి :

వానలే వానలు పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

Rains In Telangana Toady : రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రజలు అవస్థలు పడ్డారు. బేగంబజార్, కోఠి, సుల్తాన్​బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్​బాగ్, లిబర్టీ, నారాయణగూడ, హిమాయత్‌నగర్, లక్డీకపూల్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. ఈ క్రమంలోనే రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 5 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. పలుచోట్ల తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోయాయి. లో లెవల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో.. పలు గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. ప్రాజెక్టుల్లోకి ప్రవాహం పెరుగుతోంది. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నవీపేట్ మండలంలోని జన్నేపల్లి పెద్ద చెరువు అలుగు పారుతుంది. నిజామాబాద్ నగర శివారులోని గూపన్‌పల్లి ఉన్నత పాఠశాల.. వరద నీటితో చెరువును తలపిస్తోంది. పాఠశాల మొత్తం నీటితో నిండిపోయి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నీటిలో నుంచే రాకపోకలు సాగించాల్సి రావడం వల్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.

Heavy Rain Alert To Telangana : మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జోరు వాన కురుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టులు, చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి. సత్తుపల్లిలో ఎడతెరిపి లేని వర్షాలకు బేతుపల్లి చెరువుకు వరద ప్రవాహం పెరిగింది. భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లందు, కోయగూడెంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది.

Weather Updates : రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. రైతన్నల్లో చిగురిస్తోన్న ఆశలు

Rains in Telangana 2023 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు జలాశయాల్లోకి చేరడంతో అవి జలకళ సంతరించుకుంటున్నాయి. వరంగల్‌ పైడిపల్లిలో వర్షాల ధాటికి ఓ పాత ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది శిథిలాల నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు.

Telangana Rains Toady : వర్షాల వల్ల భూపాలపల్లి సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లోని కేటీకే 2,3 గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. తద్వారా 7,025 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. ఫలితంగా రూ.1.72 కోట్ల నష్టం వాటిల్లింది. 1.63 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత వర్షం కారణంగా ఆగిపోయింది. గనిలో నిలిచిన వర్షపు నీటిని భారీ పంపుల ద్వారా బయటకు పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. వచ్చే 3 రోజులూ రాష్ట్రంలో పరిస్థితులు ఇలాగే ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఇవీ చదవండి :

Last Updated : Jul 19, 2023, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.