ETV Bharat / state

వరద బాధితులందరికి పదివేలు ఇస్తాం: దానం

ప్రజలు ఇబ్బందులు పడకుండా వరద బాధితులందరికి పదివేల ఆర్థిక సాయం అందిస్తామని ఖైరాతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హిమాయత్‌నగర్‌ డివిజన్‌లోని పలు బస్తీల్లో రెండో విడత సాయాన్ని ఆయన అందజేశారు. నైతిక విలువలు మరచి ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.

author img

By

Published : Nov 5, 2020, 5:41 PM IST

Flood help to people in himayath nagar division by MLA dhanam
ప్రతిపక్షాల ఆరోపణలు అర్థరహితం : ఎమ్మెల్యే దానం

ప్రభుత్వం మానవతా దృక్పథంతో వరద బాధితులకు సాయం చేస్తుంటే... ప్రతిపక్షాలు పనిగట్టుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. హిమాయత్ నగర్‌ డివిజన్‌లోని పలు బస్తీల ప్రజలకు ఇంటింటికి వెళ్లి వరద సాయం అందజేశారు.

నైతిక విలువలు పక్కనబెట్టి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. బాధితులకు చివరి ఇంటి వరకు పరిహారం అందిస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని దానం హితవు పలికారు.

ఇదీ చూడండి:గ్రేటర్​ డబుల్​ బెడ్ రూం ఇళ్ల కోసం రూ.600 కోట్లు విడుదల

ప్రభుత్వం మానవతా దృక్పథంతో వరద బాధితులకు సాయం చేస్తుంటే... ప్రతిపక్షాలు పనిగట్టుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. హిమాయత్ నగర్‌ డివిజన్‌లోని పలు బస్తీల ప్రజలకు ఇంటింటికి వెళ్లి వరద సాయం అందజేశారు.

నైతిక విలువలు పక్కనబెట్టి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. బాధితులకు చివరి ఇంటి వరకు పరిహారం అందిస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని దానం హితవు పలికారు.

ఇదీ చూడండి:గ్రేటర్​ డబుల్​ బెడ్ రూం ఇళ్ల కోసం రూ.600 కోట్లు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.