ETV Bharat / state

మీ భూమిలో 'సౌర విద్యుత్'తో కాసులు పండించొచ్చు! - ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి - SOLAR POWER PLANTS

సాగులో లేని బీడు, వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో సోలార్‌ విద్యుత్ ప్లాంట్లు - పీఎం కుసుమ్‌ పథకం వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తున్న అధికారులు - దరఖాస్తులకు ఈ నెల 22 ఆఖరు తేదీ

Power Plants Crop Field
Power Plants Crop Field In Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2025, 8:49 AM IST

Power Plants Crop Field In Telangana : విద్యుత్తు వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి జరగక కొరత ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సౌర విద్యుత్తు ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. సాగులో లేని బీడు, వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో సోలార్‌ విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో వ్యక్తులు, సంస్థలను సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేలా ప్రోత్సహిస్తోంది. ఇందుకు పీఎం కుసుమ్‌ పథకం వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తోంది. సౌరశక్తితో విద్యుత్తు ఉత్పత్తి చేసి వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోంది. దరఖాస్తులకు ఈ నెల 22 ఆఖరు తేదీ కావడంతో డిస్కం జిల్లా అధికారులు ఔత్సాహికులను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్నారు.

సౌర విద్యుత్తు కేంద్రాలు : నిర్మల్ జిల్లాలో ఇప్పటికే రెండు సౌర విద్యుత్తు కేంద్రాలు ఉన్నాయి. 33/11 కేవీ ఉపకేంద్రాలకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూముల్లో 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం వరకు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్ఛు. ఒక్కో మెగావాట్‌ ప్లాంటు ఏర్పాటు కోసం సుమారు 3.5 నుంచి 4 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. తెలంగాణ విద్యుత్తు రెగ్యులేటరీ కమిషనర్‌ (టీజీఈఆర్సీ) నిర్ణయించిన టారిఫ్‌ ప్రకారం ఉత్పత్తి చేసిన విద్యుత్తును డిస్కంలు కొనుగోలు చేస్తాయి.

రైతులు, రైతు సమూహాలు, సహకార, వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు, నీటి వినియోగదారులు, స్వయం సహాయక సంఘాలు, పంచాయతీలు, గ్రామ సంస్థలు వీటిని నెలకొల్పడానికి అర్హులుగా నిర్ణయించారు. ప్లాంట్‌ ఏర్పాటు చేయాలనుకునే వారు భూమి లీజు ఒప్పంద పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : బీడు భూముల్లో సౌర విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసే వారికి ఆర్థికంగా చేయూత కల్పించేందుకు ప్రభుత్వం, డిస్కం ఉన్నతాధికారులు ప్రత్యేకత కనబరుస్తున్నారు. ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో అవగాహన, చైతన్యం తీసుకొచ్చేలా ప్రచారం చేపడుతున్నామని నిర్మల్ డిస్కం ఎస్ఈ బి. సుదర్శనం తెలిపారు.

ఆసక్తి, అర్హులైన వారు www.tgredco.telangana.gov.in వెబ్‌సైట్‌ సంప్రదించి ఈ నెల 22 లోగా దరఖాస్తు చేసుకోవచ్ఛన్నారు. డీజీఎం 63049 03933, ఆదిలాబాద్‌లోని టీజీఆర్‌ఈడీసీవో కార్యాలయంలో, 08732-226796, 96408 03112, 63049 03960 నంబర్లను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవచ్ఛని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

మీ ఇంటిపై సోలార్ ప్లాంట్ పెట్టుకునేందుకు ప్రభుత్వ సహకారం - ఇలా అప్లై చేసుకోండి!

రైతన్నలకు అదనపు ఆదాయం తెచ్చే కొత్త స్కీమ్ - ఎలాగో తెలుసుకోండి

Power Plants Crop Field In Telangana : విద్యుత్తు వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి జరగక కొరత ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సౌర విద్యుత్తు ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. సాగులో లేని బీడు, వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో సోలార్‌ విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో వ్యక్తులు, సంస్థలను సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేలా ప్రోత్సహిస్తోంది. ఇందుకు పీఎం కుసుమ్‌ పథకం వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తోంది. సౌరశక్తితో విద్యుత్తు ఉత్పత్తి చేసి వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోంది. దరఖాస్తులకు ఈ నెల 22 ఆఖరు తేదీ కావడంతో డిస్కం జిల్లా అధికారులు ఔత్సాహికులను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్నారు.

సౌర విద్యుత్తు కేంద్రాలు : నిర్మల్ జిల్లాలో ఇప్పటికే రెండు సౌర విద్యుత్తు కేంద్రాలు ఉన్నాయి. 33/11 కేవీ ఉపకేంద్రాలకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూముల్లో 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం వరకు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్ఛు. ఒక్కో మెగావాట్‌ ప్లాంటు ఏర్పాటు కోసం సుమారు 3.5 నుంచి 4 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. తెలంగాణ విద్యుత్తు రెగ్యులేటరీ కమిషనర్‌ (టీజీఈఆర్సీ) నిర్ణయించిన టారిఫ్‌ ప్రకారం ఉత్పత్తి చేసిన విద్యుత్తును డిస్కంలు కొనుగోలు చేస్తాయి.

రైతులు, రైతు సమూహాలు, సహకార, వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు, నీటి వినియోగదారులు, స్వయం సహాయక సంఘాలు, పంచాయతీలు, గ్రామ సంస్థలు వీటిని నెలకొల్పడానికి అర్హులుగా నిర్ణయించారు. ప్లాంట్‌ ఏర్పాటు చేయాలనుకునే వారు భూమి లీజు ఒప్పంద పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : బీడు భూముల్లో సౌర విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసే వారికి ఆర్థికంగా చేయూత కల్పించేందుకు ప్రభుత్వం, డిస్కం ఉన్నతాధికారులు ప్రత్యేకత కనబరుస్తున్నారు. ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో అవగాహన, చైతన్యం తీసుకొచ్చేలా ప్రచారం చేపడుతున్నామని నిర్మల్ డిస్కం ఎస్ఈ బి. సుదర్శనం తెలిపారు.

ఆసక్తి, అర్హులైన వారు www.tgredco.telangana.gov.in వెబ్‌సైట్‌ సంప్రదించి ఈ నెల 22 లోగా దరఖాస్తు చేసుకోవచ్ఛన్నారు. డీజీఎం 63049 03933, ఆదిలాబాద్‌లోని టీజీఆర్‌ఈడీసీవో కార్యాలయంలో, 08732-226796, 96408 03112, 63049 03960 నంబర్లను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవచ్ఛని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

మీ ఇంటిపై సోలార్ ప్లాంట్ పెట్టుకునేందుకు ప్రభుత్వ సహకారం - ఇలా అప్లై చేసుకోండి!

రైతన్నలకు అదనపు ఆదాయం తెచ్చే కొత్త స్కీమ్ - ఎలాగో తెలుసుకోండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.