ఈనెల 24 న గౌలీగూడ బస్టాప్ నుంచి చోరీకి గురైన ఆర్టీసీ బస్సు కేసులో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న మహారాష్ట్ర నాందేడ్కు సమీపంలో పోలీసులు బస్సు విడిభాగాలను గుర్తించారు. ఏకంగా బస్టాండ్ నుంచే బస్సు చోరీ చేయడాన్ని అధికారుల తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎత్తుకెళ్లిన కొన్ని గంటల్లోనే విడిభాగాలుగా చేయడం కేవలం అనుభవజ్ఞులైన మెకానిక్లు మాత్రమే చేయాగలరనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎన్ని రోజులుగా రెక్కి చేశారు... ఎవరెవరున్నారు.. ఇంతకముందు ఇలాంటి చోరీలు చేశారా... అనే అంశాలపైనే పోలీసులు దృష్టిసారించారు.
ఇవీ చూడండి: రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు