ETV Bharat / state

మెట్రో ప్రయాణికుల్లో ఫిట్​నెస్​ అవగాహన - hyderabad metro latest news

ఉరుకుల పరుగుల జీవితంలో పడి వీలైనంత తక్కువ సమయంలో సుఖవంతంగా తాము గమస్థానాలు చేరుకోవాలని ఆలోచిస్తున్నారు ప్రయాణికులు. ఇక ఎస్కలేటర్లు, లిఫ్టుల రాక వారి పనులను సులభతరం చేశాయి. ఫలితంగా నడకను పూర్తిగా విస్మరిస్తున్నారు. దీనిని తగ్గించి ప్రయాణికుల్లో శరీర దారుడ్ఢ్యంపై అవగాహన, నడక ప్రాముఖ్యతను వివరించేలా హైదరాబాద్​ రాయదుర్గం మెట్రో అధికారులు వినూత్న ప్రయోగానికి తెరలేపారు. ఎన్ని మెట్లెక్కితే ఎన్ని క్యాలరీలు ఖర్చు చేయవచ్చో మెట్లపై సూచించారు.

fitness awareness for metro passengers by displayed calory values in hyderabad rayadurgam metro station
మెట్రో ప్రయాణికుల్లో ఫిట్నెస్​ అవగాహన
author img

By

Published : Feb 24, 2020, 7:47 PM IST

మెట్రో ప్రయాణికుల్లో ఫిట్నెస్​పై అవగాహన కల్పించేందుకు అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మొదటి అంతస్థులో ఉండే మెట్రోరైల్లో ప్రయాణించే వారు మెట్ల మార్గం ఎన్నుకోవడం ద్వారా ఎన్ని క్యాలరీలను ఖర్చు చేయొచ్చో సూచించేలా మెట్లపై చిత్రీకరించారు.

మాదాపూర్, రాయదుర్గం, మెట్రోస్టేషన్లలో ప్రయాణికులు లిఫ్ట్, ఎస్కలేటర్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనితో రద్దీ సమయంలో మెట్ల మార్గాన్ని కూడా ఉపయోగించేలా అధికారులు చర్యలు చేపట్టారు.

స్టేషన్ మొదటి అంతస్తు చేరుకోవడానికి ఉపయోగించే మెట్లపై ఒక మెట్టు ఎక్కితే 0.5 క్యాలరీస్ ఖర్చు అవుతాయని అలా మెట్లపై కాలరీల విలవలను సూచిస్తూ దాదాపు 30 మెట్లు ఎక్కితే 30 క్యాలరీస్ ఖర్చవుతాయని చిత్రీకరించారు. తద్వారా ప్రయాణికులు తమ శరీర దారుఢ్యంపై మనసుపెట్టి నడక మార్గాన్ని ఎన్నుకుంటారని అధికారులు ఆశిస్తున్నారు.

రోజురోజుకు పెరుగుతున్న ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ప్రయాణికులకు నడక ప్రాముఖ్యతను ఈ విధంగా వివరిస్తున్నామని అధికారులు చెప్తున్నారు.

మెట్రో ప్రయాణికుల్లో ఫిట్నెస్​ అవగాహన

ఇదీ చూడండి: మెట్రోస్టేషన్లలో అద్దెకు మొబైల్‌ పవర్‌బ్యాంక్‌లు

మెట్రో ప్రయాణికుల్లో ఫిట్నెస్​పై అవగాహన కల్పించేందుకు అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మొదటి అంతస్థులో ఉండే మెట్రోరైల్లో ప్రయాణించే వారు మెట్ల మార్గం ఎన్నుకోవడం ద్వారా ఎన్ని క్యాలరీలను ఖర్చు చేయొచ్చో సూచించేలా మెట్లపై చిత్రీకరించారు.

మాదాపూర్, రాయదుర్గం, మెట్రోస్టేషన్లలో ప్రయాణికులు లిఫ్ట్, ఎస్కలేటర్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనితో రద్దీ సమయంలో మెట్ల మార్గాన్ని కూడా ఉపయోగించేలా అధికారులు చర్యలు చేపట్టారు.

స్టేషన్ మొదటి అంతస్తు చేరుకోవడానికి ఉపయోగించే మెట్లపై ఒక మెట్టు ఎక్కితే 0.5 క్యాలరీస్ ఖర్చు అవుతాయని అలా మెట్లపై కాలరీల విలవలను సూచిస్తూ దాదాపు 30 మెట్లు ఎక్కితే 30 క్యాలరీస్ ఖర్చవుతాయని చిత్రీకరించారు. తద్వారా ప్రయాణికులు తమ శరీర దారుఢ్యంపై మనసుపెట్టి నడక మార్గాన్ని ఎన్నుకుంటారని అధికారులు ఆశిస్తున్నారు.

రోజురోజుకు పెరుగుతున్న ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ప్రయాణికులకు నడక ప్రాముఖ్యతను ఈ విధంగా వివరిస్తున్నామని అధికారులు చెప్తున్నారు.

మెట్రో ప్రయాణికుల్లో ఫిట్నెస్​ అవగాహన

ఇదీ చూడండి: మెట్రోస్టేషన్లలో అద్దెకు మొబైల్‌ పవర్‌బ్యాంక్‌లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.