ETV Bharat / state

కాంగ్రెస్​ సమావేశంలో.. కుర్చీల కోసం కొట్లాట - congress meeting

హైదరాబాద్​ లాలాపేట్​లో కాంగ్రెస్​ ముఖ్య కార్యకర్తల సమావేశానికి సికింద్రాబాద్​ పార్లమెంట్​ అభ్యర్థి అంజన్​ కుమార్​ యాదవ్​ హాజరయ్యారు. సభలో ప్రసంగిస్తుండగా.. కార్యకర్తల మధ్య వివాదం తలెత్తింది. కుర్చీల విషయంలో తలెత్తిన గొడవతో సభ అర్ధాంతరంగా ముగిసింది.

సికింద్రాబాద్​ పార్లమెంట్​ అభ్యర్థి అంజన్​ కుమార్​ యాదవ్​
author img

By

Published : Mar 29, 2019, 1:10 AM IST

పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత కార్యకర్తలందరిపై ఉందని సికింద్రాబాద్​ పార్లమెంట్​ అభ్యర్థి అంజన్​కుమార్​యాదవ్​ పేర్కొన్నారు. హైదరాబాద్​ లాలాపేట్​లో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

కుర్చీల కోసం కొట్లాట:

తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్​ పార్టీయేనని అంజన్​కుమార్​ యాదవ్​ అన్నారు. సభలో ఆయన మాట్లాడుతుండగా... ఇద్దరు కార్యకర్తల మధ్య కుమ్ములాట జరిగింది. కుర్చీల కోసం తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. కార్యకర్తల వీరంగం చూసిన అంజన్​కుమార్​ యాదవ్​తో పాటు అక్కడున్న నేతలంతా ఖంగుతిన్నారు. చుట్టుపక్కల ఉన్న వారు ఎంత సముదాయించినా వినకపోవడం వల్ల సభ అర్ధాంతరంగా ముగిసింది.

ఇవీ చూడండి:17 స్థానాలు.. 443 మంది అభ్యర్థులు

పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత కార్యకర్తలందరిపై ఉందని సికింద్రాబాద్​ పార్లమెంట్​ అభ్యర్థి అంజన్​కుమార్​యాదవ్​ పేర్కొన్నారు. హైదరాబాద్​ లాలాపేట్​లో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

కుర్చీల కోసం కొట్లాట:

తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్​ పార్టీయేనని అంజన్​కుమార్​ యాదవ్​ అన్నారు. సభలో ఆయన మాట్లాడుతుండగా... ఇద్దరు కార్యకర్తల మధ్య కుమ్ములాట జరిగింది. కుర్చీల కోసం తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. కార్యకర్తల వీరంగం చూసిన అంజన్​కుమార్​ యాదవ్​తో పాటు అక్కడున్న నేతలంతా ఖంగుతిన్నారు. చుట్టుపక్కల ఉన్న వారు ఎంత సముదాయించినా వినకపోవడం వల్ల సభ అర్ధాంతరంగా ముగిసింది.

ఇవీ చూడండి:17 స్థానాలు.. 443 మంది అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.