ETV Bharat / state

DOST: దోస్త్​లో సీటు పొందిన అభ్యర్థులు కళాశాలల్లో చేరే గడువు పొడిగింపు

దోస్త్(dost)​లో సీటు పొందిన అభ్యర్థులు కళాశాలలకు వెళ్లి చేరే గడువు(dost reporting date extend)ను ఈనెల 7 వరకు పొడిగించారు. మూడో విడతలో సీటు పొందిన వారు సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు కూడా ఈనెల 7వరకు పొడిగించారు.

author img

By

Published : Oct 6, 2021, 12:11 PM IST

దోస్త్​లో సీటు పొందిన అభ్యర్థులు కళాశాలల్లో చేరే గడువు పొడిగింపు
దోస్త్​లో సీటు పొందిన అభ్యర్థులు కళాశాలల్లో చేరే గడువు పొడిగింపు

దోస్త్​(dost)లో సీటు పొందిన అభ్యర్థులు కళాశాలలకు వెళ్లి చేరే గడువును ఈనెల 7 వరకు పొడిగించారు. మూడో విడతలో సీటు పొందిన వారు సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు(dost reporting date extend) కూడా ఈనెల 7వరకు పొడిగించినట్లు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. నేటి వరకు 2 లక్షల 11 వేల 728 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయగా... వారిలో లక్షా 89 వేల 774 మంది కాలేజీల్లో చేరారు.

ఈ ఏడాది కూడా కామర్స్​లో చేరేందుకే ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి కనబరిచారు. కేటాయించిన సీట్లలో 39.43 శాతం కామర్స్ విద్యార్థులకే ఉన్నాయి. ఆ తర్వాత భౌతిక శాస్త్రంలో విద్యార్థులు సీటు పొందారు. ఈ సారి అబ్బాయిలకన్నా అమ్మాయిలే సంప్రదాయ డిగ్రీలో చేరేందుకు మొగ్గు చూపారు.

దోస్త్​(dost)లో సీటు పొందిన అభ్యర్థులు కళాశాలలకు వెళ్లి చేరే గడువును ఈనెల 7 వరకు పొడిగించారు. మూడో విడతలో సీటు పొందిన వారు సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు(dost reporting date extend) కూడా ఈనెల 7వరకు పొడిగించినట్లు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. నేటి వరకు 2 లక్షల 11 వేల 728 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయగా... వారిలో లక్షా 89 వేల 774 మంది కాలేజీల్లో చేరారు.

ఈ ఏడాది కూడా కామర్స్​లో చేరేందుకే ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి కనబరిచారు. కేటాయించిన సీట్లలో 39.43 శాతం కామర్స్ విద్యార్థులకే ఉన్నాయి. ఆ తర్వాత భౌతిక శాస్త్రంలో విద్యార్థులు సీటు పొందారు. ఈ సారి అబ్బాయిలకన్నా అమ్మాయిలే సంప్రదాయ డిగ్రీలో చేరేందుకు మొగ్గు చూపారు.

ఇదీ చదవండి: అక్టోబర్ 8న 'రామోజీ ఫిల్మ్ సిటీ' రీఓపెన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.