ETV Bharat / state

ట్రాన్స్​జెండర్​ కమ్యూనిటీ డెస్క్​ను ప్రారంభించిన సీపీ సజ్జనార్​

author img

By

Published : Mar 6, 2021, 3:12 PM IST

హైదరాబాద్​ గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ట్రాన్స్​జెండర్​ కమ్యూనిటీ డెస్క్​ను సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ ప్రారంభించారు. ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఈ డెస్క్​ దోహదపడుతుందని తెలిపారు.

transgender community desk, cyberabad cp sajjanar
ట్రాన్స్​జెండర్​ కమ్యూనిటీ డెస్క్​, సైబరాబాద్​ సీపీ సజ్జనార్​

ట్రాన్స్‌జెండర్లకు సమాజంలో సరైన గుర్తింపు లేదని.. సమాజంలో వారికి సుముఖత స్థానం కోసం సైబరాబాద్ పోలీసులు కృషి చేస్తున్నారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్​ను సజ్జనార్ ప్రారంభించారు. ఈ డెస్క్ ద్వారా ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు, ప్రభుత్వం నుంచి లభించే సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు.

ట్రాన్స్​జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎస్సీఎస్సీ ముందుకు రావడం అభినందనీయమని సజ్జనార్​ పేర్కొన్నారు. కాగ్నిజెంట్​తో పాటు పలు సాఫ్ట్​వేర్​ కంపెనీల్లో 18 మంది ట్రాన్స్​జెండర్లకు ఉద్యోగాలు లభించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్ రావు, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ సాకేత్, ఎస్సీఎస్సీ అధ్యక్షుడు వేదుల కృష్ణ, సైబరాబాద్ షీ టీమ్స్ ఇన్​ఛార్జ్ డీసీపీ అనసూయ తదితరులు పాల్గొన్నారు.

ట్రాన్స్‌జెండర్లకు సమాజంలో సరైన గుర్తింపు లేదని.. సమాజంలో వారికి సుముఖత స్థానం కోసం సైబరాబాద్ పోలీసులు కృషి చేస్తున్నారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్​ను సజ్జనార్ ప్రారంభించారు. ఈ డెస్క్ ద్వారా ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు, ప్రభుత్వం నుంచి లభించే సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు.

ట్రాన్స్​జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎస్సీఎస్సీ ముందుకు రావడం అభినందనీయమని సజ్జనార్​ పేర్కొన్నారు. కాగ్నిజెంట్​తో పాటు పలు సాఫ్ట్​వేర్​ కంపెనీల్లో 18 మంది ట్రాన్స్​జెండర్లకు ఉద్యోగాలు లభించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్ రావు, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ సాకేత్, ఎస్సీఎస్సీ అధ్యక్షుడు వేదుల కృష్ణ, సైబరాబాద్ షీ టీమ్స్ ఇన్​ఛార్జ్ డీసీపీ అనసూయ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది: మంత్రి ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.