ఓటీపీ పేరుతో సైబర్ మోసం.. 3.5 లక్షలు స్వాహా - ఓఎల్ఎక్స్, ఓటీపీ, క్రెడిట్ పేర్లతో సైబర్ మోసం
సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. కొత్తకొత్త పద్ధతులతో గాలం వేసి మోసం చేస్తున్నారు. తాజాగా ఓఎల్ఎక్స్, ఓటీపీ పేర్లతో రూ.3.5 లక్షలు కాజేశారు. మరో కేసులో బంధువులకే అసభ్య మెసేజ్లు పంపి ఓ వ్యక్తి అరెస్టయ్యారు.

ఓటీపీ పేర్లతో సైబర్ మోసం..3.5 లక్షలు స్వాహా
ఓఎల్ఎక్స్, ఓటీపీ, క్రెడిట్ కార్డ్ పేరుతో సైబర్ నేరగాళ్లు 3.5 లక్షల రూపాయలను కొల్లగొట్టారు. ఈ మేరకు బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు.
మరో కేసులో బంధువులకే అసభ్య మెసేజ్లు పంపిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 40 ఏళ్లు నిండిన తనకు పెళ్లి కాకపోవడం వల్ల బంధువుల అమ్మాయినే ఓ ప్రభుద్దుడు వేధించడం ప్రారంభించాడు. బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఐపీ అడ్రస్ ఆధారంగా విద్యానగర్కి చెందిన నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
TAGGED:
3.5 లక్షల రూపాయల సైబర్ మోసం