టీఎస్–బీపాస్ బిల్లును ప్రస్తుతం రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా మాత్రమే అమలు చేస్తున్నామని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తర్వాతే పూర్తి స్థాయిలో ఈ బిల్లు అమల్లోకి వస్తుందన్నారు. కొత్త మున్సిపల్ చట్టం–2019లో పట్టణ ప్రణాళికలు, భవన నిర్మాణ, లేఔట్ అనుమతులు స్థానిక సంస్థలే నిర్వహించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.
టీఎస్–బీపాస్కు సంబంధించిన సాఫ్ట్ వేర్ అప్లికేషన్ ప్రస్తుతం పురోగతిలో ఉందని ఆయన వెల్లడించారు. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య అనుసంధాన ప్రక్రియతో పాటు ప్రభుత్వ స్థలాలు, నిషేధిత సర్వే నంబర్ల వివరాలు తదితర అంశాలను పొందుపరిచే ప్రక్రియ ఇంకా పురోగతిలో ఉందన్నారు. వాటి తర్వాతే టీఎస్-బీపాస్ బిల్లు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని అరవింద్ కుమార్ పేర్కొన్నారు.