ETV Bharat / state

దూరదృష్టి లేకపోవడం వల్లే కోహెడ ప్రమాదం : చాడ - Koheda Market Chada Venkatareddy

దూరదృష్టి, పారదర్శకత లేకపోవడం వల్లే కోహెడ మార్కెట్​ ప్రమాదం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. గాలివానకు దెబ్బతిన్న కోహెడ మార్కెట్​ను సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, పశ్య పద్మ, ఇతర నేతలతో కలిసి ఆయన పరిశీలించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
author img

By

Published : May 5, 2020, 1:58 PM IST

Updated : May 5, 2020, 5:22 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ చొరవ తీసుకుని కోహెడ మార్కెట్​ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. గాలివానకు దెబ్బతిన్న కోహెడ మార్కెట్​ను సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, పశ్య పద్మ, ఇతర నేతలతో నేతలతో కలిసి చాడ సందర్శించారు. అక్కడి రైతులు, వర్తకులు, కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కోహెడ మార్కెట్​ను అద్దంలా తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి... ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని చాడ ప్రశ్నించారు.

ప్రాంగణంలో నేల చదును కోసమే 2 కోట్ల రూపాయల ఖర్చయిందని... నాణ్యతలేమి వల్లే ఈ దుర్ఘటన సంభవించిందని విమర్శించారు. రాజుల సొమ్ము రాళ్లపాలైన చందంగా పరిస్థితి తయారైందని చాడ విమర్శించారు. పారదర్శకత, దూరదృష్టి లేకపోవడం వల్లే కోహెడలో ఇంత విధ్వంసం జరిగిందన్నారు. నాసిరకం పనులు చేసిన గుత్తేదారుపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్​ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ చొరవ తీసుకుని కోహెడ మార్కెట్​ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. గాలివానకు దెబ్బతిన్న కోహెడ మార్కెట్​ను సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, పశ్య పద్మ, ఇతర నేతలతో నేతలతో కలిసి చాడ సందర్శించారు. అక్కడి రైతులు, వర్తకులు, కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కోహెడ మార్కెట్​ను అద్దంలా తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి... ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని చాడ ప్రశ్నించారు.

ప్రాంగణంలో నేల చదును కోసమే 2 కోట్ల రూపాయల ఖర్చయిందని... నాణ్యతలేమి వల్లే ఈ దుర్ఘటన సంభవించిందని విమర్శించారు. రాజుల సొమ్ము రాళ్లపాలైన చందంగా పరిస్థితి తయారైందని చాడ విమర్శించారు. పారదర్శకత, దూరదృష్టి లేకపోవడం వల్లే కోహెడలో ఇంత విధ్వంసం జరిగిందన్నారు. నాసిరకం పనులు చేసిన గుత్తేదారుపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్

Last Updated : May 5, 2020, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.