ETV Bharat / state

రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్​

రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజూ కొవిడ్ వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు.. ఆస్పత్రులు, పీహెచ్​సీల్లో వాక్సినేషన్​ను ప్రారంభించారు. సోమవారం 335 కేంద్రాల్లో కరోనా టీకా ఇచ్చారు. ఈరోజు 13,666 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. టీకా తీసుకున్నవారిలో 15 మందికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రేపటి నుంచి ప్రతి కేంద్రంలో రోజుకి 100 మందికి వాక్సిన్​ ఇవ్వనున్నారు.

author img

By

Published : Jan 18, 2021, 10:40 PM IST

Corona vaccination continued for a second day in the state
రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్​ ప్రక్రియ

తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగింది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో 30 మంది చొప్పున టీకాలు వేయగా... ఆ సంఖ్యను 50కి పెంచారు. సోమవారం 335 కేంద్రాల్లో కరోనా టీకా ఇచ్చారు. ఈ రోజు 13,666 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. టీకా తీసుకున్న వారిలో 15 మందికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వారందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. రేపటి నుంచి ప్రతి కేంద్రంలో రోజుకి 100 మందికి వాక్సిన్​ ఇవ్వనున్నారు.

వరంగల్ అర్బన్ జిల్లాలో అత్యధికం

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యాక్సినేషన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా శాయంపేట యూపీహెచ్​సీలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టారు. మొదటిరోజుతో పోలిస్తే.. రెండోరోజు జిల్లాల్లో కేంద్రాల సంఖ్య పెంచారు. తొలిరోజు వరంగల్ జిల్లా వ్యాప్తంగా 21 కేంద్రాల్లో టీకా వేయగా... రెండోరోజు.. 45 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలో అత్యధికంగా 14 ఆరోగ్య కేంద్రాల్లో టీకా వేస్తున్నారు.

వ్యాక్సినేషన్​లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

నిజామాబాద్ జిల్లాలో 14, కామారెడ్డి జిల్లాలో 7 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేశారు. మొదటి రోజు ఉమ్మడి జిల్లాలో 10 కేంద్రాల్లో టీకాలు వేయగా.. రెండోరోజు 21 కేంద్రాలకు విస్తరించారు. ప్రతి కేంద్రంలో 30 నుంచి 50మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో మున్సిపల్ ఛైర్మన్, డిప్యూటీ డీఎంహెచ్​వో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ వైద్యశాలలో స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో రెండోరోజు టీకాల ప్రక్రియ ప్రారంభించారు.

రెండో డోసు తీసుకోవాలి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాస్పపత్రిలో వ్యాక్సినేషన్‌ను ఎమ్మెల్యే సతీశ్ కుమార్ శ్రీకారం చుట్టారు. టీకాలు వేసుకున్న వారు నిర్లక్ష్యం చేయకుండా రెండో డోసు పూర్తయ్యేవరకు జాగ్రత్తలు తీసుకోవాలని మంచిర్యాలలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, వీపనగండ్ల ప్రభుత్వాస్పత్రుల్లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కొవిడ్ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. గద్వాల జిల్లా ఐజ పీహెచ్​సీలో ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించగా.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో టీకాల పంపిణీ ప్రక్రియను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌ రెడ్డి పరిశీలించారు.

స్వల్ప అస్వస్థత

మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా తీసుకున్న ఇద్దరు అంగన్‌వాడీ సహాయ కార్యకర్తలు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మల్కాజిగిరి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి అధికారులు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి: రెండో రోజు 335 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్​

తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగింది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో 30 మంది చొప్పున టీకాలు వేయగా... ఆ సంఖ్యను 50కి పెంచారు. సోమవారం 335 కేంద్రాల్లో కరోనా టీకా ఇచ్చారు. ఈ రోజు 13,666 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. టీకా తీసుకున్న వారిలో 15 మందికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వారందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. రేపటి నుంచి ప్రతి కేంద్రంలో రోజుకి 100 మందికి వాక్సిన్​ ఇవ్వనున్నారు.

వరంగల్ అర్బన్ జిల్లాలో అత్యధికం

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యాక్సినేషన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా శాయంపేట యూపీహెచ్​సీలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టారు. మొదటిరోజుతో పోలిస్తే.. రెండోరోజు జిల్లాల్లో కేంద్రాల సంఖ్య పెంచారు. తొలిరోజు వరంగల్ జిల్లా వ్యాప్తంగా 21 కేంద్రాల్లో టీకా వేయగా... రెండోరోజు.. 45 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలో అత్యధికంగా 14 ఆరోగ్య కేంద్రాల్లో టీకా వేస్తున్నారు.

వ్యాక్సినేషన్​లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

నిజామాబాద్ జిల్లాలో 14, కామారెడ్డి జిల్లాలో 7 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేశారు. మొదటి రోజు ఉమ్మడి జిల్లాలో 10 కేంద్రాల్లో టీకాలు వేయగా.. రెండోరోజు 21 కేంద్రాలకు విస్తరించారు. ప్రతి కేంద్రంలో 30 నుంచి 50మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో మున్సిపల్ ఛైర్మన్, డిప్యూటీ డీఎంహెచ్​వో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ వైద్యశాలలో స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో రెండోరోజు టీకాల ప్రక్రియ ప్రారంభించారు.

రెండో డోసు తీసుకోవాలి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాస్పపత్రిలో వ్యాక్సినేషన్‌ను ఎమ్మెల్యే సతీశ్ కుమార్ శ్రీకారం చుట్టారు. టీకాలు వేసుకున్న వారు నిర్లక్ష్యం చేయకుండా రెండో డోసు పూర్తయ్యేవరకు జాగ్రత్తలు తీసుకోవాలని మంచిర్యాలలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, వీపనగండ్ల ప్రభుత్వాస్పత్రుల్లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కొవిడ్ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. గద్వాల జిల్లా ఐజ పీహెచ్​సీలో ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించగా.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో టీకాల పంపిణీ ప్రక్రియను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌ రెడ్డి పరిశీలించారు.

స్వల్ప అస్వస్థత

మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా తీసుకున్న ఇద్దరు అంగన్‌వాడీ సహాయ కార్యకర్తలు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మల్కాజిగిరి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి అధికారులు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి: రెండో రోజు 335 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.