ETV Bharat / state

బాలు మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు: కిషన్​రెడ్డి

author img

By

Published : Sep 25, 2020, 4:15 PM IST

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు.

CENTRAL MINISTER KISHANREDDY CONDOLENCE ON  SP BALU DEATH
బాలు మరణంం సంగీత ప్రపంచానికి తీరని లోటు: కిషన్​రెడ్డి

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. భారతీయ సంగీత చరిత్రపై బాలసుబ్రహ్మణ్యం చెరగని ముద్ర వేశారని కొనియాడారు.

అనేక భాషల్లో పాటలకు తన గాత్రంతో ప్రాణం పోయడంతో పాటు అభిమానులను అలరించారన్నారు. ఎంతోమంది ఔత్సాహిక యువ గాయకుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారని తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానన్నారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. భారతీయ సంగీత చరిత్రపై బాలసుబ్రహ్మణ్యం చెరగని ముద్ర వేశారని కొనియాడారు.

అనేక భాషల్లో పాటలకు తన గాత్రంతో ప్రాణం పోయడంతో పాటు అభిమానులను అలరించారన్నారు. ఎంతోమంది ఔత్సాహిక యువ గాయకుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారని తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానన్నారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.