ETV Bharat / state

లాక్​డౌన్​కు​ ప్రజలు సహకరించాలి: కె.లక్ష్మణ్​ - bjp latest news

దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ లాక్​డౌన్ పాటించాలని భాజపా నేత కె.లక్ష్మణ్ కోరారు. హైదరాబాద్​ గౌలిగూడలో ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావుతో కలిసి నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

bjp leader laxman distribution groceries in hyderabad
లాక్​డౌన్​కు​ ప్రజలు సహకరించాలి: కె.లక్ష్మణ్​
author img

By

Published : Apr 10, 2020, 4:07 PM IST

హైదరాబాద్ బేగంబజార్ కార్పోరేటర్ శంకర్‌యాదవ్ నేతృత్వంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు భాజపా నేత కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు. దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ లాక్​డౌన్ పాటించాలని లక్ష్మణ్ కోరారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్​ను కట్టడి చేసేందుకు సమర్ధవంతంగా ముందుకు సాగుతున్నాయన్నారు. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా వ్యాప్తి చెందుతుందనే విషయం పట్ల ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు.

హైదరాబాద్ బేగంబజార్ కార్పోరేటర్ శంకర్‌యాదవ్ నేతృత్వంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు భాజపా నేత కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు. దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ లాక్​డౌన్ పాటించాలని లక్ష్మణ్ కోరారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్​ను కట్టడి చేసేందుకు సమర్ధవంతంగా ముందుకు సాగుతున్నాయన్నారు. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా వ్యాప్తి చెందుతుందనే విషయం పట్ల ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు.

ఇదీ చూడండి: 'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.