ETV Bharat / state

జల్సాలకు అలవాటుపడి.. బైక్‌ల చోరీ - పాతబస్తీలో ద్విచక్రవాహనాల దొంగతనం

జల్సాలకు అలవాటుపడి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఇద్దరు యువకులను పాతబస్తీ కాలపత్తర్ పోలీసులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్​ తరలించారు. వారి వద్ద నుంచి రూ.6 లక్షల విలువ గల 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Bike Offenders Arrested by Old city Polices in Hyderabad
జల్సాలకు అలవాటుపడి.. బైక్‌ల చోరీ
author img

By

Published : Jul 11, 2020, 8:26 PM IST

హైద్రబాద్ పాతబస్తీ కాలాపత్తర్​లో ద్విచక్రవాహనాలు దొంగిలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటుపడిన వీళ్లు నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాలు చోరీ చేసినట్లు సీఐ సుదర్శన్​ తెలిపారు. శనివారం స్థానిక జంక్షన్​లో తనిఖీలు చేస్తుండగా చోరీ చేసిన ద్విచక్రవాహనంపై తిరుగుతూ పోలీసులకు చిక్కినట్లు వెల్లడించారు.

మొత్తం 9 ద్విచక్రవాహనాలు దొంగిలించినట్లు అంగీకరించారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. వీటి విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని తెలిపారు. అనంతరం నిందితులను పట్టుకొన్న సిబ్బందికి బహుమతులు అందించారు.

హైద్రబాద్ పాతబస్తీ కాలాపత్తర్​లో ద్విచక్రవాహనాలు దొంగిలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటుపడిన వీళ్లు నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాలు చోరీ చేసినట్లు సీఐ సుదర్శన్​ తెలిపారు. శనివారం స్థానిక జంక్షన్​లో తనిఖీలు చేస్తుండగా చోరీ చేసిన ద్విచక్రవాహనంపై తిరుగుతూ పోలీసులకు చిక్కినట్లు వెల్లడించారు.

మొత్తం 9 ద్విచక్రవాహనాలు దొంగిలించినట్లు అంగీకరించారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. వీటి విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని తెలిపారు. అనంతరం నిందితులను పట్టుకొన్న సిబ్బందికి బహుమతులు అందించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.