ETV Bharat / state

'స్పందించకపోతే రాజకీయపరమైన ఉద్యమానికి తెరతీస్తాం' - ప్రెస్​క్లబ్​లో ఫీల్డ్​అసిస్టెంట్ల సమావేశం

ఉద్యమాలతో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్.. ఉద్యమాలను చిన్న చూపు చూడటం తగదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హితవు పలికారు. హైదరాబాద్ బషీర్​బాగ్​లోని ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన ఫీల్డ్ అసిస్టెంట్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

'మీరు స్పందించకపోతే రాజకీయపరమైన ఉద్యమానికి తెరతీస్తాం'
'మీరు స్పందించకపోతే రాజకీయపరమైన ఉద్యమానికి తెరతీస్తాం'
author img

By

Published : Dec 14, 2020, 7:01 PM IST

డిమాండ్ల సాధన కోసం ఉద్యమాలు చేస్తున్న క్షేత్ర సహాయకుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. 7,610 మంది ఫీల్డ్ అసిస్టెంట్​లను విధుల నుంచి తొలగించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆ కారణంతోనే 21 మంది క్షేత్రసహాయకులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు ఈ ఉద్యమాన్ని తాము రాజకీయం చేయలేదని కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి వారిని ఉద్యోగాల్లో చేర్చుకోకపోతే రాజకీయపరమైన ఉద్యమానికి తెర తీస్తామని హెచ్చరించారు.

డిమాండ్ల సాధన కోసం ఉద్యమాలు చేస్తున్న క్షేత్ర సహాయకుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. 7,610 మంది ఫీల్డ్ అసిస్టెంట్​లను విధుల నుంచి తొలగించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆ కారణంతోనే 21 మంది క్షేత్రసహాయకులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు ఈ ఉద్యమాన్ని తాము రాజకీయం చేయలేదని కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి వారిని ఉద్యోగాల్లో చేర్చుకోకపోతే రాజకీయపరమైన ఉద్యమానికి తెర తీస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: 'పంచాయతీరాజ్​ వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం నాశనం చేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.