ETV Bharat / state

బీసీలకు చదువుకునే హక్కు లేదా..?: ఆర్​.కృష్ణయ్య

author img

By

Published : Oct 7, 2020, 4:51 PM IST

ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య మండిపడ్డారు. బీసీలకు చదువుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్లు కల్పించి.. ఫీజు రీయంబర్స్​మెంట్ అమలు చేయాలని కృష్ణయ్య డిమాండ్​ చేశారు.

బీసీలకు చదువుకునే హక్కు లేదా..?: ఆర్​. కృష్ణయ్య
బీసీలకు చదువుకునే హక్కు లేదా..?: ఆర్​. కృష్ణయ్య

రాష్ట్రంలో నూతనంగా స్థాపించిన ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం హైదరాబాద్​లో ఆందోళన చేపట్టింది. బషీర్ బాగ్​లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ముందు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసు సురేశ్​ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని కృష్ణయ్య ఆరోపించారు. బీసీలకు చదువుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి.. బీసీలతో పాటు రిజర్వేషన్ల సాధన కోసం అన్ని ఎస్సీ,ఎస్టీ, ప్రజా సంఘాలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు కల్పించి.. ఫీజు రీయంబర్స్​మెంట్ అమలు చేయాలని కృష్ణయ్య డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'రిజర్వేషన్ల పరిరక్షణ కోసం జాతీయస్థాయిలో ఉద్యమాలు'

రాష్ట్రంలో నూతనంగా స్థాపించిన ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం హైదరాబాద్​లో ఆందోళన చేపట్టింది. బషీర్ బాగ్​లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ముందు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసు సురేశ్​ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని కృష్ణయ్య ఆరోపించారు. బీసీలకు చదువుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి.. బీసీలతో పాటు రిజర్వేషన్ల సాధన కోసం అన్ని ఎస్సీ,ఎస్టీ, ప్రజా సంఘాలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు కల్పించి.. ఫీజు రీయంబర్స్​మెంట్ అమలు చేయాలని కృష్ణయ్య డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'రిజర్వేషన్ల పరిరక్షణ కోసం జాతీయస్థాయిలో ఉద్యమాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.