ETV Bharat / state

TRS President Election 2021: తెరాస అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధం.. నేటి నుంచే నామినేషన్లు

తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా అధ్యక్ష ఎన్నికకు(TRS President Election 2021 NEWS) రంగం సిద్ధమైంది. అధ్యక్ష పదవికి నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌(CM KCR NEWS) పేరిట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇవాళ్టి నుంచి తెరాస శాసనసభ, పార్లమెంటరీపక్ష సమావేశాలు జరగనున్నాయి.

author img

By

Published : Oct 17, 2021, 7:13 AM IST

TRS President Election 2021, trs plenary 2021
తెరాస అధ్యక్ష ఎన్నిక 2021, తెరాస ప్లీనరీ 2021

తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర అధ్యక్ష పదవికి(TRS President Election 2021 NEWS) ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 22 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 23న పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 24వ తేదీ తుది గడువు. 25న హెచ్‌ఐసీసీలో(HICC NEWS) జరిగే పార్టీ సర్వసభ్య సమావేశంలో అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. అదేరోజు ప్రతినిధుల సభ (ప్లీనరీ) నిర్వహిస్తారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా తెరాస మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీ విభాగాల తరఫున విడివిడిగా పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కేసీఆర్‌(TELANGANA CM KCR NEWS) పేరును ప్రతిపాదించి బలపరుస్తూ నామినేషన్లు వేయనున్నారు.

కేసీఆర్ దిశానిర్దేశం!

నేడు పార్టీ శాసనసభ, పార్లమెంటరీపక్షాల సంయుక్త సమావేశం తెలంగాణ భవన్‌లో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ హాజరై సంస్థాగత ఎన్నికలు, సర్వసభ్య సమావేశం, ప్లీనరీ, నవంబరు 15న వరంగల్‌ విజయగర్జన సభ నిర్వహణ, పార్టీ పురోగతిపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు, నగర కమిటీలపై స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తోంది. జిల్లా కమిటీలను వేయాలని అధిష్ఠానం భావించినా ముందడుగు పడలేదు. కేసీఆర్‌ అనుమతిస్తే ఆ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

సీఎం దార్శనికతతో పల్లెల మందహాసం: కేటీఆర్‌ ట్వీట్‌

దార్శనికుడైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పంతోనే పల్లెలు పచ్చని మందహాసం చేస్తున్నాయని పరిశ్రమలు, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. తెలంగాణ పల్లెల పురోగతి, పథకాలపై శ్రీనివాస్‌రావు అనే నెటిజన్‌ రూపొందించిన వీడియోను ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు.

త్వరలో వరంగల్‌కు...

తెరాస ద్విదశాబ్ది ఉత్సవాలలో భాగంగా వచ్చే నెల 15న వరంగల్‌ జిల్లాలో నిర్వహించ తలపెట్టిన విజయగర్జన భారీ బహిరంగ సభకు అనువైన స్థలాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు ఆదివారం కేసీఆర్‌, కేటీఆర్‌లకు నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం ముఖ్య నేతలతో చర్చించి వేదికను ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత సభ ఏర్పాట్ల పరిశీలనకు కేటీఆర్‌ వరంగల్‌ వెళతారని తెలుస్తోంది.

ఇదీ చదవండి: EK SHAM CHARMINAR KE NAAM: భాగ్యనగరవాసులకు గుడ్​న్యూస్​.. 'ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌' షురూ..

తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర అధ్యక్ష పదవికి(TRS President Election 2021 NEWS) ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 22 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 23న పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 24వ తేదీ తుది గడువు. 25న హెచ్‌ఐసీసీలో(HICC NEWS) జరిగే పార్టీ సర్వసభ్య సమావేశంలో అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. అదేరోజు ప్రతినిధుల సభ (ప్లీనరీ) నిర్వహిస్తారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా తెరాస మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీ విభాగాల తరఫున విడివిడిగా పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కేసీఆర్‌(TELANGANA CM KCR NEWS) పేరును ప్రతిపాదించి బలపరుస్తూ నామినేషన్లు వేయనున్నారు.

కేసీఆర్ దిశానిర్దేశం!

నేడు పార్టీ శాసనసభ, పార్లమెంటరీపక్షాల సంయుక్త సమావేశం తెలంగాణ భవన్‌లో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ హాజరై సంస్థాగత ఎన్నికలు, సర్వసభ్య సమావేశం, ప్లీనరీ, నవంబరు 15న వరంగల్‌ విజయగర్జన సభ నిర్వహణ, పార్టీ పురోగతిపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు, నగర కమిటీలపై స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తోంది. జిల్లా కమిటీలను వేయాలని అధిష్ఠానం భావించినా ముందడుగు పడలేదు. కేసీఆర్‌ అనుమతిస్తే ఆ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

సీఎం దార్శనికతతో పల్లెల మందహాసం: కేటీఆర్‌ ట్వీట్‌

దార్శనికుడైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పంతోనే పల్లెలు పచ్చని మందహాసం చేస్తున్నాయని పరిశ్రమలు, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. తెలంగాణ పల్లెల పురోగతి, పథకాలపై శ్రీనివాస్‌రావు అనే నెటిజన్‌ రూపొందించిన వీడియోను ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు.

త్వరలో వరంగల్‌కు...

తెరాస ద్విదశాబ్ది ఉత్సవాలలో భాగంగా వచ్చే నెల 15న వరంగల్‌ జిల్లాలో నిర్వహించ తలపెట్టిన విజయగర్జన భారీ బహిరంగ సభకు అనువైన స్థలాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు ఆదివారం కేసీఆర్‌, కేటీఆర్‌లకు నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం ముఖ్య నేతలతో చర్చించి వేదికను ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత సభ ఏర్పాట్ల పరిశీలనకు కేటీఆర్‌ వరంగల్‌ వెళతారని తెలుస్తోంది.

ఇదీ చదవండి: EK SHAM CHARMINAR KE NAAM: భాగ్యనగరవాసులకు గుడ్​న్యూస్​.. 'ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌' షురూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.