ETV Bharat / state

'స్థానిక' అభ్యర్థుల కోసం గులాబీ కసరత్తు

పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఎన్నిక ఏదైనా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు చేస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితి. శాసనమండలికి జరుగుతున్న ఉపఎన్నికల్లో మూడు స్థానాలు కైవసం చేసుకునేందుకు అభ్యర్థుల ఎంపిక కోసం అధినేత, యువనేత రంగంలోకి దిగుతున్నారు.

author img

By

Published : May 11, 2019, 9:31 AM IST

Updated : May 11, 2019, 11:39 AM IST

'స్థానిక' అభ్యర్థుల కోసం గులాబీ కసరత్తు


సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఉపఎన్నికలపై తెరాస కన్నేసింది. ఎలాగైనా ఆ మూడు స్థానాలు దక్కించుకోవాలన్న పట్టుదలతో గులాబీ దళం పావులు కదుపుతోంది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు మూడు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భేటీ కానున్నారు. నామపత్రాల సమర్పణకు ఈ నెల 14 వరకే గడువు ఉన్నందున ఈ రెండ్రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది.

రేసుగుర్రాలెవరో?

ఉపఎన్నికలు జరగనున్న మూడు నియోజకవర్గాల్లో రంగారెడ్డి మినహా రెండు జిల్లాల్లో పోటీ తీవ్రంగా ఉంది. వరంగల్ నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కేటీఆర్​కు సన్నిహితుడైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గత హామీ మేరకు తక్కళ్లపల్లి రవీందర్​రావు కూడా ఆశిస్తున్నప్పటికీ... మహబూబాబాద్ నుంచి ఇప్పటికే సత్యవతి రాఠోడ్​కు ఎమ్మెల్సీ ఇచ్చినందున ఈసారి ఆయన రేసులో లేనట్టేనని భావిస్తున్నారు.


నల్గొండ నుంచి బలమైన అభ్యర్థిగా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నప్పటికీ... ఆయన శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. గుత్తా అంగీకరించకుంటే... ప్రత్యామ్నాయంగా తేరా చిన్నపరెడ్డి, చాడా కిషన్​రెడ్డి, చింతల వెంకటేశ్వర్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్​రావును పరిశీలించే వీలుంది. రంగారెడ్డి స్థానం నుంచి తెరాస అభ్యర్థిత్వం కోసం పెద్దగా పోటీ లేనందున దాదాపుగా పట్నం మహేందర్ రెడ్డి ఖరారైనట్లేనని తెలుస్తోంది.

మూడు స్థానాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ప్రధాన పోటీదారులుగా ఉన్నందున.. అవసరమనుకుంటే ఓ స్థానం నుంచి బలహీన వర్గాల అభ్యర్థిని తెరమీదకు తేవాలని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

'స్థానిక' అభ్యర్థుల కోసం గులాబీ కసరత్తు

ఇవీ చూడండి: ఎమ్మెల్సీ అభ్యర్థులపై నేడు టీపీసీసీ ప్రత్యేక సమావేశం


సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఉపఎన్నికలపై తెరాస కన్నేసింది. ఎలాగైనా ఆ మూడు స్థానాలు దక్కించుకోవాలన్న పట్టుదలతో గులాబీ దళం పావులు కదుపుతోంది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు మూడు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భేటీ కానున్నారు. నామపత్రాల సమర్పణకు ఈ నెల 14 వరకే గడువు ఉన్నందున ఈ రెండ్రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది.

రేసుగుర్రాలెవరో?

ఉపఎన్నికలు జరగనున్న మూడు నియోజకవర్గాల్లో రంగారెడ్డి మినహా రెండు జిల్లాల్లో పోటీ తీవ్రంగా ఉంది. వరంగల్ నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కేటీఆర్​కు సన్నిహితుడైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గత హామీ మేరకు తక్కళ్లపల్లి రవీందర్​రావు కూడా ఆశిస్తున్నప్పటికీ... మహబూబాబాద్ నుంచి ఇప్పటికే సత్యవతి రాఠోడ్​కు ఎమ్మెల్సీ ఇచ్చినందున ఈసారి ఆయన రేసులో లేనట్టేనని భావిస్తున్నారు.


నల్గొండ నుంచి బలమైన అభ్యర్థిగా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నప్పటికీ... ఆయన శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. గుత్తా అంగీకరించకుంటే... ప్రత్యామ్నాయంగా తేరా చిన్నపరెడ్డి, చాడా కిషన్​రెడ్డి, చింతల వెంకటేశ్వర్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్​రావును పరిశీలించే వీలుంది. రంగారెడ్డి స్థానం నుంచి తెరాస అభ్యర్థిత్వం కోసం పెద్దగా పోటీ లేనందున దాదాపుగా పట్నం మహేందర్ రెడ్డి ఖరారైనట్లేనని తెలుస్తోంది.

మూడు స్థానాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ప్రధాన పోటీదారులుగా ఉన్నందున.. అవసరమనుకుంటే ఓ స్థానం నుంచి బలహీన వర్గాల అభ్యర్థిని తెరమీదకు తేవాలని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

'స్థానిక' అభ్యర్థుల కోసం గులాబీ కసరత్తు

ఇవీ చూడండి: ఎమ్మెల్సీ అభ్యర్థులపై నేడు టీపీసీసీ ప్రత్యేక సమావేశం

Intro:Body:Conclusion:
Last Updated : May 11, 2019, 11:39 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.