ETV Bharat / state

సంప్రదాయబద్ధంగా శ్రీరామ పట్టాభిషేకం : ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ

author img

By

Published : Apr 3, 2020, 11:23 AM IST

భద్రాద్రిలో సంప్రదాయబద్ధంగా శ్రీరామ పట్టాభిషేక ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రభుత్వాల ఆదేశాలతో సామాజిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తామని వెల్లడించారు.

ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ
ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ

కరోనా బారి నుంచి ప్రజలందరినీ రక్షించాలని సీతారామచంద్రులను కోరినట్లు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో అతి కొద్ది మందితో ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు చెప్పారు. ప్రజలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ వేడుకలను తిలకించాలని ఆయన కోరారు. మానవుడి లాగా జన్మించి... రావణాసురుడిని సంహరించి... ముల్లోకాల్లో తనకు ఎదురు లేదని నిరూపించుకున్న వ్యక్తి శ్రీరాముడని ఆలయ స్థానాచార్యుడు స్థల సాయి వివరించారు. రామునికి చేసే పట్టాభిషేకం విశేషమైనదని ఆయన పేర్కొన్నారు.

సంప్రదాయబద్ధంగా శ్రీరామ పట్టాభిషేకం : ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ

ఇవీ చూడండి: మర్కజ్ కేసుల కోసం ప్రత్యేక ప్రోటోకాల్

కరోనా బారి నుంచి ప్రజలందరినీ రక్షించాలని సీతారామచంద్రులను కోరినట్లు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో అతి కొద్ది మందితో ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు చెప్పారు. ప్రజలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ వేడుకలను తిలకించాలని ఆయన కోరారు. మానవుడి లాగా జన్మించి... రావణాసురుడిని సంహరించి... ముల్లోకాల్లో తనకు ఎదురు లేదని నిరూపించుకున్న వ్యక్తి శ్రీరాముడని ఆలయ స్థానాచార్యుడు స్థల సాయి వివరించారు. రామునికి చేసే పట్టాభిషేకం విశేషమైనదని ఆయన పేర్కొన్నారు.

సంప్రదాయబద్ధంగా శ్రీరామ పట్టాభిషేకం : ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ

ఇవీ చూడండి: మర్కజ్ కేసుల కోసం ప్రత్యేక ప్రోటోకాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.