ETV Bharat / state

భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

author img

By

Published : Sep 11, 2020, 7:18 PM IST

ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా పెద్ద ఎత్తున తరలిస్తున్న గంజాయిని భద్రాచలంలో పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సూమారు రూ. 2 కోట్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు
భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పోలీసులు భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 1,415 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్ కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక, విశాఖపట్నం, హైదరాబాద్ కు చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

2 వ్యాన్లతో సహా సుమారు రూ. 2 కోట్ల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం ఏఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సుమారు 20కి పైగా గంజాయి కేసులు నమోదైనట్లు తెలిపారు. అక్రమ తరలింపులకు పాల్పపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పోలీసులు భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 1,415 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్ కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక, విశాఖపట్నం, హైదరాబాద్ కు చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

2 వ్యాన్లతో సహా సుమారు రూ. 2 కోట్ల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం ఏఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సుమారు 20కి పైగా గంజాయి కేసులు నమోదైనట్లు తెలిపారు. అక్రమ తరలింపులకు పాల్పపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: నూతన రెవెన్యూ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.