భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని మొండితోగులో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ దోమతెరలు పంపిణీ చేశారు. వచ్చే వర్షకాలంలో వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి దోమల వ్యాప్తిని అరికట్టాలని తెలిపారు.
ఇదీ చదవండి: అంతర్రాష్ట్ర సర్వీసులపై నిర్ణయం ఆ తర్వాతే : కేసీఆర్