ETV Bharat / state

అది బూటకపు ఎన్​కౌంటరే.. ఆజాద్ పేరుతో మావోల లేఖ విడుదల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆజాద్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. తెలంగాణ చత్తీస్​గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతం పరిధిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో బూటకపు ఎన్​కౌంటర్ చేశారని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. గుండాల మండలంలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శంకరును కావాలనే ఎన్​కౌంటర్​ చేశారని లేఖలో పేర్కొన్నారు.

author img

By

Published : Sep 11, 2020, 6:22 PM IST

అది బూటకపు ఎన్​కౌంటరే.. ఆజాద్ పేరుతో మావోల లేఖ విడుదల
అది బూటకపు ఎన్​కౌంటరే.. ఆజాద్ పేరుతో మావోల లేఖ విడుదల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆజాద్ పేరుతో లేఖ విడుదల చేసిన మావోయిస్టులు. తెలంగాణ చత్తీస్​గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతం పరిధిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పూసగుప్ప వద్ద 4 రోజుల క్రితం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.

బూటకపు ఎన్​కౌంటర్​ అంటూ లేఖ..

ఇవి ఎదురుకాల్పులు కాదని.. బూటకపు ఎన్​కౌంటర్ అని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. గుండాల మండలంలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శంకరును కావాలనే ఎన్​కౌంటర్​ చేశారని లేఖలో పేర్కొన్నారు.

ఎదురు కాల్పులుగా చిత్రీకరణ..

తెరాస ప్రభుత్వం ఇద్దరు మావోయిస్ట్ సభ్యులను చిత్రహింసలతో హత్య చేసి ఎదురు కాల్పులుగా చిత్రీకరించారని లేఖలో పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, తూర్పుగోదావరి ఏరియా డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేరుతో ఈ లేఖను విడుదల చేశారు. బూటకపు ఎన్​కౌంటర్​కి నిరసనగా పౌరహక్కుల సంఘాలు పోరాడాలని లేఖలో స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : ఆ సభలో సభ్యుడిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా: దానం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆజాద్ పేరుతో లేఖ విడుదల చేసిన మావోయిస్టులు. తెలంగాణ చత్తీస్​గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతం పరిధిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పూసగుప్ప వద్ద 4 రోజుల క్రితం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.

బూటకపు ఎన్​కౌంటర్​ అంటూ లేఖ..

ఇవి ఎదురుకాల్పులు కాదని.. బూటకపు ఎన్​కౌంటర్ అని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. గుండాల మండలంలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శంకరును కావాలనే ఎన్​కౌంటర్​ చేశారని లేఖలో పేర్కొన్నారు.

ఎదురు కాల్పులుగా చిత్రీకరణ..

తెరాస ప్రభుత్వం ఇద్దరు మావోయిస్ట్ సభ్యులను చిత్రహింసలతో హత్య చేసి ఎదురు కాల్పులుగా చిత్రీకరించారని లేఖలో పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, తూర్పుగోదావరి ఏరియా డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేరుతో ఈ లేఖను విడుదల చేశారు. బూటకపు ఎన్​కౌంటర్​కి నిరసనగా పౌరహక్కుల సంఘాలు పోరాడాలని లేఖలో స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : ఆ సభలో సభ్యుడిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా: దానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.