కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం రామయ్య సన్నిధిలో... మార్చి 22 నుంచి భక్తుల దర్శనాలు నిలిపివేశారు. ఆ రోజు నుంచి ఆలయ అర్చకులు బయటకు రాకుండా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ 40 రోజుల్లో భక్తుల దర్శనాలు లేక రూ.5 కోట్ల మేర ఆదాయం పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. అర్చకులు, వేద పండితులు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఇవ్వడం కష్టంగా మారిందంటున్నారు.
ఇటీవల ఆలయంలో నిర్వహించే పూజలు, అర్చనలు, నిత్య కల్యాణాలు... భక్తులు తమ పేరు మీద జరిపించుకునేందు దేవాదాయశాఖ ఆన్లైన్ సేవలు ప్రారంభించింది. తద్వారా భక్తులు ఎక్కడ ఉన్నా ఆన్లైన్లో నగదు చెల్లించి కోరిన సేవలు జరిపించుకోవచ్చు. ఇప్పటికే భారీ నష్టాన్ని చవిచూసిన భద్రాద్రి ఆలయం... లాక్డౌన్ ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున నష్టాల్లో కూరుకుపోయే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చూడండి: ఇద్దరి నుంచి 22 మందికి కరోనా.. అన్నీ జీహెచ్ఎంసీలోనే