కరోనా విపత్కర పరిస్థితుల్లో తెరాస ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. భద్రాచలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పార్టీ మారుతున్నట్లు గులాబీ వర్గాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఖమ్మం జిల్లా మధిరలోని తన నివాసంలో ఎమ్మెల్యే వీరయ్యతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. వీరయ్య కాంగ్రెస్లోనే కొనసాగుతారని... ఏ పార్టీకి వెళ్లట్లేదని భట్టి స్పష్టం చేశారు.