ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో అన్నా భావో సాటే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ రాథోడ్ జనార్ధన్ సాహిత్య సామ్రాట్ అన్న భావో సాటే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి, అన్నా భావో సాటే జీవిత చరిత్ర గురించి వివరించారు. ఆయన పేరు మీద కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానని జిల్లా పరిషత్ ఛైర్మన్ అన్నారు. ఇందుకు గానూ.. రూ.5 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఐబీ చౌరస్తాలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయంత్ రావు, ఎమ్మార్పీఎస్ నాయకులు పలువురు నేతలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల