అమెరికాలోని సెయింట్ లూయిస్ వేదికగా జరిగిన కెయిన్స్ కప్ చెస్ టోర్నీలో... భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి విజేతగా నిలిచింది. సోమవారం మరో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారికతో జరిగిన తొమ్మిది, పదో రౌండ్లను డ్రా చేసుకుంది. ఫలితంగా 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి.. ట్రోఫీ కైవసం చేసుకుంది హంపి.
ప్రపంచ ఛాంపియన్ వెన్జున్ 5.5 పాయింట్లతో రెండో స్థానం, అలెగ్జాండ్రా 5 పాయింట్లతో మూడో ర్యాంక్లో నిలిచింది. హారిక 4.5 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది.
ప్రపంచ ర్యాంకింగ్స్@2
తాజా విజయంతో 45 వేల అమెరికా డాలర్ల ప్రైజ్మనీ గెల్చుకుంది హంపి. అంతేకాకుండా ఈమె ఖాతాలో 5 ఈఎల్వో రేటింగ్ పాయింట్లు చేరాయి. ఇవి అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకింగ్స్ మెరుగుపడేందుకు ఉపయోగపడతాయి. ప్రస్తుత ప్రదర్శనతో ప్రపంచ రెండోర్యాంక్నూ త్వరలోనే అందుకోనుంది హంపి. త్వరలో ఇటలీ వేదికగా మే నెలలో జరగనున్న గ్రాండ్ ప్రిక్స్లో ఈమె ఆడనుంది.
రెండు నెలల్లో మరో టైటిల్...
పునరాగమనంలో కోనేరు హంపి.. అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఆరంభంలోనే మొనాకో గ్రాండ్ప్రి చెస్ రన్నరప్గా నిలిచిన ఈ తెలుగమ్మాయి... ఆ తర్వాత ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ పతకం అందించిన తొలి మహిళా చెస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత మాస్కో వేదికగా ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్షిప్లోనూ మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకుంది.