టోక్యో ఒలింపిక్స్ టార్చ్ రిలే మార్చి 25న ప్రారంభంకానుంది. జపాన్లోని ఫుకుషిమాలోని నరహా పట్టణంలో జ్యోతిని వెలిగిస్తారు. అప్పటి నుంచి జులై 23న టోక్యోలోని జాతీయ స్టేడియంలో విశ్వక్రీడల ప్రారంభ కార్యక్రమం ఈ రిలేను అక్కడ తిప్పుతారు.
గతేడాది గ్రీస్ నుంచి జ్యోతి టోక్యో తీసుకొచ్చాక రిలే ప్రారంభమయ్యే ముందే కరోనా కారణంగా ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే దాదాపు 10వేల మంది టార్చ్బేరర్లు(జ్యోతిని తిప్పేవారు), సిబ్బంది, అభిమానులకు కొన్ని నిబంధనలు విధించారు నిర్వాహకులు. వాటిని గురువారం విడుదల చేశారు.
"ఎవరూ అరవడం, కేరింతలు కొట్టడానికి వీలులేదు. చప్పట్లు కొడుతూ ఉత్సహాపరచవచ్చు. భౌతిక దూరం నిబంధన పాటించాల్సి ఉంటుంది. టార్చ్బేరర్లకు మాస్కు తప్పనిసరి కాదు, కానీ మిగిలినవారు విధిగా ధరించాలి."
-యుకిహికో నునొముర, నిర్వాహక కమిటీ వైస్ డైరక్టర్ జనరల్
టార్చ్ రిలే నిర్వహణ ప్రకటనతో ఒలింపిక్స్ జరగడంపై నెలకొన్న అనుమానాలకు తెరపడింది. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ విశ్వక్రీడలు జరగనున్నాయి.
ఇదీ చూడండి: 'ఒలింపిక్స్ ఆటగాళ్లకు త్వరలోనే కొవిడ్ టీకా'