Odisha Open: ఒడిశా ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీలో హరియాణాకు చెందిన ఉన్నతి హుడా(14) సంచలనం సృష్టించింది. బీడబ్ల్యూఎఫ్ సూపర్ 100 టోర్నీ గెలిచిన పిన్న వయసు భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.
ఆదివారం జరిగన మ్యాచ్లో 21 ఏళ్ల తోష్నివాల్ను 21-18, 21-11 తేడాతో ఓడించి ఒడిశా ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకుంది.
మరోవైపు మహిళల డబుల్స్లో ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ జంట విజయం సాధించింది. సన్యోగిత గోర్పదే, శ్రుతి మిశ్రా జోడిని 21-12, 21-10 తేడాతో ఓడించింది.
కిరణ్ జార్జ్దే..
21 ఏళ్ల కిరణ్ జార్జ్.. పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచాడు. ప్రియాన్షు రజావత్పై విజయం సాధించాడు. కాగా, మిక్స్డ్ డబుల్స్లో భారత్కు చెందిన అర్జున్, ట్రీసా జాలీని 21-16, 22-20 తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది శ్రీలంకకు చెందిన సచిన్ దియాస్, తిలిని జోడీ.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:
శిఖరాగ్రాన భారత జట్టు.. ఆ మ్యాచ్తో 1000 వన్డేల రికార్డు
Australian Open: మహిళల డబుల్స్ టైటిల్ గెలిచిన క్రెజికోవా, సైనికోవా