ETV Bharat / sports

కోహ్లీ కన్నా ముందు అక్షర్​ను పంపడంలో వ్యూహమిదే..

author img

By

Published : Dec 26, 2022, 3:33 PM IST

భారత్​, బంగ్లాదేశ్​ మధ్య జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్‌ పటేల్‌ను 4వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇలా చేయడం వెనుక ఉన్న వ్యూహాన్ని పుజారా వెల్లడించాడు.

axar patel kohli
axar patel kohli

బంగ్లాదేశ్‌తో మిర్పూర్‌లో జరిగిన రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ కంటే అక్షర్‌ పటేల్‌ను ముందు బ్యాటింగ్‌కు పంపడంపై అజేయ్‌ జడేజా, గావస్కర్‌ వంటి మాజీ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ, టీమ్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ వ్యవూహాత్మకంగానే అక్షర్‌ పటేల్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపింది. ఈ విషయంపై ఓ టీవీ కార్యక్రమంలో జడేజా టీమ్‌ ఇండియా బ్యాటర్‌ పుజారాను ప్రశ్నించాడు. దీనికి జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని పుజారా సమర్థించాడు. ''అది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే బంగ్లా ప్రధాన బౌలింగ్‌ దళంలో ఇద్దరు లెఫ్టార్మ్‌ స్పిన్నర్లు ఉన్నారు. అక్షర్‌ ఎడమచేతి వాటం బ్యాటర్‌. అందుకే కుకుబుర్రా బంతిని ఎదుర్కోవడంలో అనుభవం ఉన్న అక్షర్‌ను బ్యాటింగ్‌కు పంపారు. అది మాకు చాలా కీలక నిర్ణయం. ఇన్నింగ్స్‌లో సాయంత్రం వేళ మరిన్ని వికెట్లు పోకుండా చూసుకోవాల్సిన సమయం అది. 145 పరుగుల లక్ష్య సాధనలో.. ప్రతి పరుగూ కీలకమైందే. ఈ క్రమంలో అక్షర్‌ చాలా విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు'' అని పేర్కొన్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అక్షర్‌ 69 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్ల సాయంతో 34 పరుగులు చేశాడు.

అక్షర్‌ను 4వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై జడేజా మాట్లాడుతూ ''ఇది కోహ్లీకి మంచి సంకేతాలు పంపదు. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌. కోహ్లీనే ఈ మార్పు కోరితే అది వేరే విషయం. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ, అక్షర్‌ కూడా బాగానే ఆడాడనుకోండి. ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకోవడం కష్టం'' అని వ్యాఖ్యానించాడు.

మరోవైపు గావాస్కర్‌ కూడా టీమ్‌ ఇండియా నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ''అతడు (కోహ్లీ) ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు. ఇంకా 15 ఓవర్లు మిగిలి ఉన్నాయి. లెఫ్ట్‌, రైట్‌ కాంబినేషన్‌ అని చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి ఆలోచనే వస్తుంది. కానీ, నేను అనుకోవడం.. రిషబ్‌ పంత్‌ ఏమైనా నిద్రమాత్ర వేసుకొన్నాడా..? మనం ఇక్కడ కూర్చొని చెప్పడం ఈజీనే. కానీ, ఎవరికైనా బాగోలేదేమో మనకు తెలియదుగా'' అని వెటకారంగా పేర్కొన్నాడు.

బంగ్లాదేశ్‌తో మిర్పూర్‌లో జరిగిన రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ కంటే అక్షర్‌ పటేల్‌ను ముందు బ్యాటింగ్‌కు పంపడంపై అజేయ్‌ జడేజా, గావస్కర్‌ వంటి మాజీ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ, టీమ్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ వ్యవూహాత్మకంగానే అక్షర్‌ పటేల్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపింది. ఈ విషయంపై ఓ టీవీ కార్యక్రమంలో జడేజా టీమ్‌ ఇండియా బ్యాటర్‌ పుజారాను ప్రశ్నించాడు. దీనికి జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని పుజారా సమర్థించాడు. ''అది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే బంగ్లా ప్రధాన బౌలింగ్‌ దళంలో ఇద్దరు లెఫ్టార్మ్‌ స్పిన్నర్లు ఉన్నారు. అక్షర్‌ ఎడమచేతి వాటం బ్యాటర్‌. అందుకే కుకుబుర్రా బంతిని ఎదుర్కోవడంలో అనుభవం ఉన్న అక్షర్‌ను బ్యాటింగ్‌కు పంపారు. అది మాకు చాలా కీలక నిర్ణయం. ఇన్నింగ్స్‌లో సాయంత్రం వేళ మరిన్ని వికెట్లు పోకుండా చూసుకోవాల్సిన సమయం అది. 145 పరుగుల లక్ష్య సాధనలో.. ప్రతి పరుగూ కీలకమైందే. ఈ క్రమంలో అక్షర్‌ చాలా విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు'' అని పేర్కొన్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అక్షర్‌ 69 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్ల సాయంతో 34 పరుగులు చేశాడు.

అక్షర్‌ను 4వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై జడేజా మాట్లాడుతూ ''ఇది కోహ్లీకి మంచి సంకేతాలు పంపదు. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌. కోహ్లీనే ఈ మార్పు కోరితే అది వేరే విషయం. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ, అక్షర్‌ కూడా బాగానే ఆడాడనుకోండి. ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకోవడం కష్టం'' అని వ్యాఖ్యానించాడు.

మరోవైపు గావాస్కర్‌ కూడా టీమ్‌ ఇండియా నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ''అతడు (కోహ్లీ) ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు. ఇంకా 15 ఓవర్లు మిగిలి ఉన్నాయి. లెఫ్ట్‌, రైట్‌ కాంబినేషన్‌ అని చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి ఆలోచనే వస్తుంది. కానీ, నేను అనుకోవడం.. రిషబ్‌ పంత్‌ ఏమైనా నిద్రమాత్ర వేసుకొన్నాడా..? మనం ఇక్కడ కూర్చొని చెప్పడం ఈజీనే. కానీ, ఎవరికైనా బాగోలేదేమో మనకు తెలియదుగా'' అని వెటకారంగా పేర్కొన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.