ETV Bharat / sports

గుజరాత్​ టైటాన్స్​కు ఫుల్ జోష్​.. ఐపీఎల్​ ఫైనల్​కు మోదీ, షా!

author img

By

Published : May 25, 2022, 5:24 PM IST

IPL Final Modi: ఈనెల 29న అహ్మదాబాద్​ వేదికగా జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్​కు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్​ ఇప్పటికే ఫైనల్ చేరిన నేపథ్యంలో సొంత రాష్ట్రానికి చెందిన ఇద్దరు దిగ్గజ నేతల రాకతో జట్టులో ఫుల్​ జోష్​ నిండనుంది.

IPL Final 2022
గుజరాత్​కు ఫుల్ జోష్​.. ఐపీఎల్​ ఫైనల్​కు మోదీ, షా!

IPL Final 2022: ఐపీఎల్​లో అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే అదరొగట్టింది గుజరాత్ టైటాన్స్. టోర్నీలో తిరుగులేని విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ను ఓడించి ఫైనల్ చేరింది. ప్రపంచంలో అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందిన అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మే 29న ఈ మ్యాచ్ జరగనుంది.

IPL News: అయితే ఐపీఎల్ ఫైనల్​ను వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఈ మ్యాచ్​కు అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు దిగ్గజ నేతలు హాజరవుతుండటం గుజరాత్​ జట్టులో మరింత జోష్​ను నింపనుంది. అతిపెద్ద స్డేడియం కావడం వల్ల లక్షల మంది అభిమానులు ఈ మ్యాచ్​ను వీక్షించేందుకు రానున్నారు. మోదీ, షా కూడా వస్తుండటంతో స్టేడియం దద్దరిల్లే అవకాశముంది. ఈ మ్యాచ్​కు సంబంధించి టికెట్లు కూడా ఇప్పుటికే అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది.

IPL final at the Narendra Modi Stadium
గుజరాత్​కు ఫుల్ జోష్​.. ఐపీఎల్​ ఫైనల్​కు మోదీ, షా!

Gujarat Titans: మోదీ ఈనెల 28న గుజరాత్​ను సందర్శించనున్నారు. అమిత్ షా కూడా 29న ఓ స్పోర్ట్స్​ ఎన్​క్లేవ్​కు భూమి పూజ చేసి ప్రారంభించనున్నారు. ఐపీఎల్ ఫైనల్ కూడా అదే రోజు జరగుతుండటం వల్ల ఇద్దరూ మ్యాచ్​ను ప్రత్యక్షంగా తిలకించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. మరోవైపు స్టేడియం వద్ద మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షల మందితో పాటు ప్రధాని, హోం మంత్రి వచ్చే అవకాశాలు ఉండటంతో అధికారులు మరింత అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు.

IPL final at the Narendra Modi Stadium
గుజరాత్​కు ఫుల్ జోష్​.. ఐపీఎల్​ ఫైనల్​కు మోదీ, షా!

IPL Final Gujarat: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ ఏడాది చివర్లోనే జరగనున్నాయి. సొంత రాష్ట్రానికి చెందిన ఇద్దరు దిగ్గజ నేతలు లక్షల మంది సమక్షంలో మ్యాచ్​ను తిలకిస్తే ఆ ప్రభావం ఎన్నికల్లోనూ చూపే అవకాశం ఉంది. ఐపీఎల్​ ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా బుధవారం ఆర్సీబీ, లఖ్​నవూ జట్లు పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మే 27న క్వాలిఫయర్​-2లో రాజస్థాన్​ను ఎదుర్కొంటుంది. అందులో గెలిచిన టీం ఫైనల్​లో గుజరాత్​ను ఢీకొంటుంది. మరి ఈ మూడు జట్లలో ఏది ఫైనల్ చేరుతుందో మే 27న తెలిసిపోతుంది. ఒకవేళ గుజరాత్​, లఖ్​నవూ ఫైనల్లో తలపడితే.. ఐపీఎల్​ చరిత్రలో రెండు కొత్త జట్లు ఫైనల్ చేరడం ఇదే తొలిసారి కానుంది. కొత్త జట్టే ఛాంపియన్​గా అవతరిస్తుంది.

IPL final at the Narendra Modi Stadium
గుజరాత్​కు ఫుల్ జోష్​.. ఐపీఎల్​ ఫైనల్​కు మోదీ, షా!

ఇదీ చదవండి: IPL 2022: 'ఆర్సీబీ కప్పు గెలిచే వరకు నేను పెళ్లి చేసుకోను'

IPL Final 2022: ఐపీఎల్​లో అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే అదరొగట్టింది గుజరాత్ టైటాన్స్. టోర్నీలో తిరుగులేని విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ను ఓడించి ఫైనల్ చేరింది. ప్రపంచంలో అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందిన అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మే 29న ఈ మ్యాచ్ జరగనుంది.

IPL News: అయితే ఐపీఎల్ ఫైనల్​ను వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఈ మ్యాచ్​కు అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు దిగ్గజ నేతలు హాజరవుతుండటం గుజరాత్​ జట్టులో మరింత జోష్​ను నింపనుంది. అతిపెద్ద స్డేడియం కావడం వల్ల లక్షల మంది అభిమానులు ఈ మ్యాచ్​ను వీక్షించేందుకు రానున్నారు. మోదీ, షా కూడా వస్తుండటంతో స్టేడియం దద్దరిల్లే అవకాశముంది. ఈ మ్యాచ్​కు సంబంధించి టికెట్లు కూడా ఇప్పుటికే అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది.

IPL final at the Narendra Modi Stadium
గుజరాత్​కు ఫుల్ జోష్​.. ఐపీఎల్​ ఫైనల్​కు మోదీ, షా!

Gujarat Titans: మోదీ ఈనెల 28న గుజరాత్​ను సందర్శించనున్నారు. అమిత్ షా కూడా 29న ఓ స్పోర్ట్స్​ ఎన్​క్లేవ్​కు భూమి పూజ చేసి ప్రారంభించనున్నారు. ఐపీఎల్ ఫైనల్ కూడా అదే రోజు జరగుతుండటం వల్ల ఇద్దరూ మ్యాచ్​ను ప్రత్యక్షంగా తిలకించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. మరోవైపు స్టేడియం వద్ద మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షల మందితో పాటు ప్రధాని, హోం మంత్రి వచ్చే అవకాశాలు ఉండటంతో అధికారులు మరింత అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు.

IPL final at the Narendra Modi Stadium
గుజరాత్​కు ఫుల్ జోష్​.. ఐపీఎల్​ ఫైనల్​కు మోదీ, షా!

IPL Final Gujarat: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ ఏడాది చివర్లోనే జరగనున్నాయి. సొంత రాష్ట్రానికి చెందిన ఇద్దరు దిగ్గజ నేతలు లక్షల మంది సమక్షంలో మ్యాచ్​ను తిలకిస్తే ఆ ప్రభావం ఎన్నికల్లోనూ చూపే అవకాశం ఉంది. ఐపీఎల్​ ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా బుధవారం ఆర్సీబీ, లఖ్​నవూ జట్లు పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మే 27న క్వాలిఫయర్​-2లో రాజస్థాన్​ను ఎదుర్కొంటుంది. అందులో గెలిచిన టీం ఫైనల్​లో గుజరాత్​ను ఢీకొంటుంది. మరి ఈ మూడు జట్లలో ఏది ఫైనల్ చేరుతుందో మే 27న తెలిసిపోతుంది. ఒకవేళ గుజరాత్​, లఖ్​నవూ ఫైనల్లో తలపడితే.. ఐపీఎల్​ చరిత్రలో రెండు కొత్త జట్లు ఫైనల్ చేరడం ఇదే తొలిసారి కానుంది. కొత్త జట్టే ఛాంపియన్​గా అవతరిస్తుంది.

IPL final at the Narendra Modi Stadium
గుజరాత్​కు ఫుల్ జోష్​.. ఐపీఎల్​ ఫైనల్​కు మోదీ, షా!

ఇదీ చదవండి: IPL 2022: 'ఆర్సీబీ కప్పు గెలిచే వరకు నేను పెళ్లి చేసుకోను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.