ETV Bharat / sports

టీమ్ఇండియా డ్రెస్సింగ్​ రూమ్​ సెలబ్రేషన్స్​, కాలా చష్మాకు చిందులేస్తూ

author img

By

Published : Aug 23, 2022, 10:25 AM IST

Teamindia celebrations జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన టీమ్​ఇండియా సంతోషంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో డ్రెస్సింగ్​ రూమ్​లో ఆటగాళ్లు బాలీవుడ్‌ పాపులర్‌ పాట 'కాలా చష్మా' పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ఈ వీడియో సోషల్​మీడియాలో ట్రెండ్ అవుతోంది. మీరూ చూసేయండి.

టీమ్ఇండియా డ్రెస్సింగ్​ రూమ్​ సెలబ్రేషన్స్​
Teamindia Celebrations

Teamindia celebrations సోమవారం జరిగిన మ్యాచ్​లో జింబాబ్వేపై గెలిచి వన్డే సిరీస్​ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది టీమ్​ఇండియా. 13 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో భారత ప్లేయర్లు ఆనందంలో మునిగి తేలుతున్నారు. తెగ సంబరాలు చేసుకుంటున్నారు. డ్రెస్సింగ్ రూమ్​లో చిందులేస్తూ ఫుల్​ ఎంజాయ్​ చేశారు. శిఖర్‌ ధావన్‌, శుభమన్​ గిల్​, ఇషాన్‌ కిషన్‌ సహా మిగతా ఆటగాళ్లు బాలీవుడ్‌ పాపులర్‌ పాట.. 'కాలా చష్మా' పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ముఖ్యంగా ధావన్‌, మ్యాచ్‌ హీరో గిల్‌లు కాలా చస్మా సిగ్నేచర్‌ స్టెప్పులతో ఉర్రూతలూగించారు. ఈ సంబరాల వీడియోను వైస్ కెప్టెన్ శిఖర్ ధావన్ తన ఇన్​స్టాలో పోస్ట్ చేశాడు. 'మేము మా విజయాన్ని ఇలా జరుపుకున్నాం' అని వ్యాఖ్య రాసుకొచ్చాడు. ఈ వీడియో సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. కాగా, ఈ నెల 27వ తేదీ నుంచి టీమ్​ఇండియా ఆసియా కప్ ఆడనుంది. ఈ టోర్నీలో పాక్​తో రెండు సార్లు తలపడనుంది.

ఇక ఈ మూడో వన్డేలో టీమ్​ఇండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించి 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేఎల్ రాహుల్.. జింబాబ్వేకు బౌలింగ్ అప్పగించాడు. ధావన్​తో కలిసి బ్యాటింగ్​కు దిగిన రాహుల్.. పరుగులు చేసేందుకు చెమటోడ్చాడు. మరో ఎండ్​లో ధావన్ సైతం ఆచితూచి ఆడటం వల్ల.. ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. అయితే, రాహుల్ ఔట్ అయిన తర్వాత వచ్చిన యువ బ్యాటర్ శుభ్​మన్​ గిల్.. ఈ మ్యాచ్​లో అదరగొట్టాడు. చక్కటి ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ధావన్(40) వెనుదిరిగినా.. ఇషాన్ కిషన్​(50)తో కలిసి సాధికారికంగా బ్యాటింగ్ చేసి శతక మోత మోగించాడు. మొత్తంగా 97 బంతుల్లో 130 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డును బద్దలుకొట్టాడు. జింబాబ్వేపై అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత బ్యాటర్​గా రికార్డుకెక్కాడు. ఇదివరకు ఈ రికార్డు సచిన్(127 నాటౌట్) పేరిట ఉండేది. అనంతరం వచ్చిన దీపక్ హుడా, శాంసన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ ఆకట్టుకోలేదు. దీంతో చివర్లో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 50 ఓవర్ల తర్వాత 8 వికెట్లు కోల్పోయి 289 పరుగులతో నిలిచింది.

290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు.. తడబడుతూ ఇన్నింగ్స్ ఆరంభించింది. మూడో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. అయితే, ఆ తర్వాత కాస్త సమయోచితంగా వ్యవహరించిన కైటానో(13), సీన్ విలియమ్స్(45) జోడి.. రెండో వికెట్​కు 70కి పైగా పరుగులు జోడించింది. ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీశాడు. సీన్ విలియమ్స్​ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కైటానో, టోనీ, రేగిస్ చకాబ్వా, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వేలు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయితే, ఓవైపు సికందర్ రజా(115) ఒంటరి పోరాటం చేశాడు. ఓ దశలో జింబాబ్వేను గెలిపించినంత పనిచేశాడు. కానీ, భారత బౌలర్లు పుంజుకొని ఆ జట్టును కట్టడి చేశారు. భారత బౌలర్లలో ఆవేశ్​ ఖాన్​ మూడు వికెట్లు తీశాడు. దీపక్ చాహర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా శార్దూలా ఠాకూర్​ ఒక వికెట్ పడగొట్టాడు.

ఇదీ చూడండి: మూడు ఫార్మాట్లలో ఇద్దరూ రాణిస్తున్నారు, తర్వాతి కెప్టెన్‌ ఎవరంటే

Teamindia celebrations సోమవారం జరిగిన మ్యాచ్​లో జింబాబ్వేపై గెలిచి వన్డే సిరీస్​ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది టీమ్​ఇండియా. 13 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో భారత ప్లేయర్లు ఆనందంలో మునిగి తేలుతున్నారు. తెగ సంబరాలు చేసుకుంటున్నారు. డ్రెస్సింగ్ రూమ్​లో చిందులేస్తూ ఫుల్​ ఎంజాయ్​ చేశారు. శిఖర్‌ ధావన్‌, శుభమన్​ గిల్​, ఇషాన్‌ కిషన్‌ సహా మిగతా ఆటగాళ్లు బాలీవుడ్‌ పాపులర్‌ పాట.. 'కాలా చష్మా' పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ముఖ్యంగా ధావన్‌, మ్యాచ్‌ హీరో గిల్‌లు కాలా చస్మా సిగ్నేచర్‌ స్టెప్పులతో ఉర్రూతలూగించారు. ఈ సంబరాల వీడియోను వైస్ కెప్టెన్ శిఖర్ ధావన్ తన ఇన్​స్టాలో పోస్ట్ చేశాడు. 'మేము మా విజయాన్ని ఇలా జరుపుకున్నాం' అని వ్యాఖ్య రాసుకొచ్చాడు. ఈ వీడియో సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. కాగా, ఈ నెల 27వ తేదీ నుంచి టీమ్​ఇండియా ఆసియా కప్ ఆడనుంది. ఈ టోర్నీలో పాక్​తో రెండు సార్లు తలపడనుంది.

ఇక ఈ మూడో వన్డేలో టీమ్​ఇండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించి 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేఎల్ రాహుల్.. జింబాబ్వేకు బౌలింగ్ అప్పగించాడు. ధావన్​తో కలిసి బ్యాటింగ్​కు దిగిన రాహుల్.. పరుగులు చేసేందుకు చెమటోడ్చాడు. మరో ఎండ్​లో ధావన్ సైతం ఆచితూచి ఆడటం వల్ల.. ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. అయితే, రాహుల్ ఔట్ అయిన తర్వాత వచ్చిన యువ బ్యాటర్ శుభ్​మన్​ గిల్.. ఈ మ్యాచ్​లో అదరగొట్టాడు. చక్కటి ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ధావన్(40) వెనుదిరిగినా.. ఇషాన్ కిషన్​(50)తో కలిసి సాధికారికంగా బ్యాటింగ్ చేసి శతక మోత మోగించాడు. మొత్తంగా 97 బంతుల్లో 130 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డును బద్దలుకొట్టాడు. జింబాబ్వేపై అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత బ్యాటర్​గా రికార్డుకెక్కాడు. ఇదివరకు ఈ రికార్డు సచిన్(127 నాటౌట్) పేరిట ఉండేది. అనంతరం వచ్చిన దీపక్ హుడా, శాంసన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ ఆకట్టుకోలేదు. దీంతో చివర్లో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 50 ఓవర్ల తర్వాత 8 వికెట్లు కోల్పోయి 289 పరుగులతో నిలిచింది.

290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు.. తడబడుతూ ఇన్నింగ్స్ ఆరంభించింది. మూడో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. అయితే, ఆ తర్వాత కాస్త సమయోచితంగా వ్యవహరించిన కైటానో(13), సీన్ విలియమ్స్(45) జోడి.. రెండో వికెట్​కు 70కి పైగా పరుగులు జోడించింది. ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీశాడు. సీన్ విలియమ్స్​ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కైటానో, టోనీ, రేగిస్ చకాబ్వా, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వేలు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయితే, ఓవైపు సికందర్ రజా(115) ఒంటరి పోరాటం చేశాడు. ఓ దశలో జింబాబ్వేను గెలిపించినంత పనిచేశాడు. కానీ, భారత బౌలర్లు పుంజుకొని ఆ జట్టును కట్టడి చేశారు. భారత బౌలర్లలో ఆవేశ్​ ఖాన్​ మూడు వికెట్లు తీశాడు. దీపక్ చాహర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా శార్దూలా ఠాకూర్​ ఒక వికెట్ పడగొట్టాడు.

ఇదీ చూడండి: మూడు ఫార్మాట్లలో ఇద్దరూ రాణిస్తున్నారు, తర్వాతి కెప్టెన్‌ ఎవరంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.