ETV Bharat / sports

శ్రీలంక ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజులో కోత

author img

By

Published : Jul 22, 2021, 6:17 PM IST

టీమ్ఇండియాతో జరిగిన రెండో వన్డేలో నిర్ణీత సమయంలో ఒక ఓవర్​ తక్కువుగా వేసింది శ్రీలంక జట్టు. దీంతో ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజులో నుంచి 20శాతం కోత విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్​ నియంత్రణ మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకుంది.

Sri Lanka fined for slow overrate in second ODI against India
స్లో ఓవర్ రేటు- శ్రీలంక ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజులో కోత

స్లో ఓవర్ రేట్​ కారణంగా శ్రీలంక​​ క్రికెటర్ల మ్యాచ్​ ఫీజులో 20శాతం కోత పడింది. మంగళవారం టీమ్ఇండియాతో జరిగిన రెండో వన్డేలో నిర్ణీత సమయానికి ఒక ఓవర్​ తక్కువగా బౌలింగ్​ వేసింది లంక జట్టు. దీంతో ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజులో కోత విధిస్తూ ఐసీసీ మ్యాచ్​ రిఫరీ రంజన్​ మదుగల్లె నిర్ణయం తీసుకున్నారు.

స్లో ఓవర్​ రేటు కారణంగా శ్రీలంక జట్టుకు చెందిన సూపర్​లీగ్​ పాయింట్లపై కూడా ప్రభావం పడనుంది. "ఐసీసీ పురుషుల క్రికెట్​ ప్రపంచకప్​ సూపర్​లీగ్​ ఆటగాళ్ల నిబంధనల ప్రకారం స్లో-ఓవర్​ రేటులో ప్రతి ఒవర్​కు ఒక సూపర్​లీగ్​ పాయింట్​ను తగ్గించాలి. ఈ నేపథ్యంలో లంక జట్టుకు ఒక పాయింట్​ పెనాల్టీ పడింది," ఐసీసీ పాలకవర్గం వెల్లడించింది.

ఇదీ చూడండి.. చాహర్​ వీరోచిత ఇన్నింగ్స్​.. టీమ్ఇండియాదే సిరీస్​

స్లో ఓవర్ రేట్​ కారణంగా శ్రీలంక​​ క్రికెటర్ల మ్యాచ్​ ఫీజులో 20శాతం కోత పడింది. మంగళవారం టీమ్ఇండియాతో జరిగిన రెండో వన్డేలో నిర్ణీత సమయానికి ఒక ఓవర్​ తక్కువగా బౌలింగ్​ వేసింది లంక జట్టు. దీంతో ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజులో కోత విధిస్తూ ఐసీసీ మ్యాచ్​ రిఫరీ రంజన్​ మదుగల్లె నిర్ణయం తీసుకున్నారు.

స్లో ఓవర్​ రేటు కారణంగా శ్రీలంక జట్టుకు చెందిన సూపర్​లీగ్​ పాయింట్లపై కూడా ప్రభావం పడనుంది. "ఐసీసీ పురుషుల క్రికెట్​ ప్రపంచకప్​ సూపర్​లీగ్​ ఆటగాళ్ల నిబంధనల ప్రకారం స్లో-ఓవర్​ రేటులో ప్రతి ఒవర్​కు ఒక సూపర్​లీగ్​ పాయింట్​ను తగ్గించాలి. ఈ నేపథ్యంలో లంక జట్టుకు ఒక పాయింట్​ పెనాల్టీ పడింది," ఐసీసీ పాలకవర్గం వెల్లడించింది.

ఇదీ చూడండి.. చాహర్​ వీరోచిత ఇన్నింగ్స్​.. టీమ్ఇండియాదే సిరీస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.